యాప్నగరం

బేల్దారి మేస్త్రీని బండరాళ్లతో కొట్టి.. అనంతపురంలో దారుణం

అనంతపురంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో కొట్టి అత్యంత కిరాతకంగా హతమార్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 26 Jun 2021, 6:14 pm
ఇటీవల ఏపీలో హత్యలు పెరిగిపోయాయి. రాజకీయ కక్షలు, భూ వివాదాలు, వివాహేతర సంబంధాలకు పలువురు బలైపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో దారుణ హత్య వెలుగుచూసింది. అనంతపురం నగరంలోని జేఎన్‌టీయూ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఓ వ్యక్తిని కిరాతకంగా చంపేశారు. గుర్తు తెలియని దుండగులు అర్థరాత్రి సమయంలో హతమార్చినట్లు తెలుస్తోంది. మృతుడిని బేల్దారీ మేస్త్రీ యల్లప్పగా గుర్తించారు. యల్లప్పను బండరాళ్లతో కొట్టి అతి దారుణంగా అంతమొందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
anantapur


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.