యాప్నగరం

అనంతపురం: ఆన్ లైన్‎లో మొబైల్ బుక్ చేశాడు.. బాక్స్ ఓపెన్ చేసి కంగుతిన్నాడు

Anantapur Mobile Cheating వ్యవహారం బయటపడింది. ఆన్‌లైన్‌లో రూ.34 వేల విలువైన మొబైల్ బుక్ చేశారు. ఇంటికి కొత్త ఫోన్ పార్శిల్ తెచ్చి ఇచ్చిన డెలివరీ బాయ్.. తీరా బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మొబైల్ లేదు. ముందస్తు జాగ్రత్తగా బాక్స్ ఓపెన్ చేసేముందు వీడియో తీసుకున్నారు. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే డబ్బులు రీఫండ్ చేస్తామని చెప్పారు. ఇంతకీ మోసం ఎక్కడ జరిగిందనే చర్చ జరుగుతోంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 26 Nov 2022, 12:39 pm

ప్రధానాంశాలు:

  • అనంతపురంలో ఆన్‌లైన్ మొబైల్ ఆర్డర్ చేశారు
  • డెలివరీ బాయ్ ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేసి చూస్తే
  • బాక్సులో ఏముందో చూసి కంగుతిన్నాడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Anantapur Mobile Cheating
ఇటీవల కాలంలో ఆన్‌లైన్ ఆఫర్‌లు పెరిగాయి. ఈ కామర్స్ సంస్థలు క్యాష్ బ్యాక్‌తో పాటూ మరికొన్ని ఆఫర్లను ప్రకటిస్తోంది. అంతేకాదు ఇప్పుడు మొబైల్స్ నుంచి కూరగాయల వరకు అన్నీ హోడ్ డెలివరీ చేస్తున్నారు. కానీ ఒక్కోసారి ఆన్‌లైన్ ఆర్డర్ల విషయంలో మోసాలు జరుగుతున్నాయి. మొబైల్ బుక్ చేస్తే సబ్బులు, రాళ్లు రావడం వంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా అనంతపురంలో ఇలాంటి తరహా ఘటన మరొకటి జరిగింది.
అనంతపురం పాతూరు భాగ్యనగర్‌కు చెందిన మస్తాన్‌వలి ఆన్‌లైన్‌‌లో ఓ ఈ కామర్స్‌ సంస్థ నుంచి ఈ నెల 14న రూ.34 వేలు విలువ చేసే మొబైల్ బుక్ చేశారు. ఈ నెల 17న డెలివరీ బాయ్‌ ఆ బాక్సును తెచ్చి ఇచ్చాడు. ఆ బాక్సు తీసుకోగానే బాగా బరువుగా అనిపించింది. అతడికి అనుమానం రావడంతో ముంద జాగ్రత్తగా బాక్స్ ఓపెన్ చేసే సమయంలో వీడియో తీశాడు. తీరా బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో మొబైల్ బదులు హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కనిపించడంతో అవాక్కయ్యారు.

మస్తాన్‌వలి వెంటనే కస్టమర్‌ కేర్‌కి కాల్ చేసి తనకు మొబైల్ బదులు షాంపూ బాటిల్ వచ్చిందని చెప్పారు. ఇటు డెలివరీ చేసిన స్టోర్‌ మేనేజర్‌‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో స్టోర్ మేనేజర్‌ రెండు మూడు రోజుల్లో బాధితుడికి డబ్బులు రీఫండ్‌ అవుతాయని చెప్పారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో కూడా ఆరా తీస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు చాలానే జరిగింది. ఆన్‌లైన్‌లో ఒక వస్తువు ఆర్డర్‌ చేస్తే.. మరొకటి వస్తోంది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.