యాప్నగరం

అనంతపురం: పోలీస్ స్టేషన్ ముందు నిప్పటించుకున్నాడు.. కారణం ఏంటని ఆరా తీస్తే షాక్

ఏం జరిగిందో ఏమో పోలీసుస్టేషన్‌ ఆవరణలోనే పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన పోలీసులు మంటలను ఆర్పేసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 25 Dec 2020, 10:30 am
నంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు మనస్తాపంతో ఒంటిపై పెట్రోలు పొసుకొని నిప్పంటించుకోవడం కలకలంరేపింది. పామిడి సంతమార్కెట్‌ నారాయణస్వామివీధికి చెందిన రామాంజనేయులు పండ్ల వ్యాపారం చేసుకునేవాడు. కొద్దిరోజులుగా అతడు ఆటో నడుపుతున్నాడు. గురువారం ఆటోస్టాండులో మరో ఆటోడ్రైవర్‌ రామాంజనేయులుపై ఘర్షణకు దిగడంతో.. అతడికి గాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్‌పై ఫిర్యాదు చేయడానికి అతడు పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు.
Samayam Telugu అనంతపురం జిల్లా


ఏం జరిగిందో ఏమో పోలీసుస్టేషన్‌ ఆవరణలోనే పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన పోలీసులు మంటలను ఆర్పేసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పట్టించుకోలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం రామాంజనేయులు మధ్యాహ్నం మద్యం తాగి స్టేషన్‌కు వచ్చి తనపై ఆటో డ్రైవర్‌ దాడిచేశాడని సిబ్బందితో చెప్పగా.. వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు అతడిని పిలుచుకొని ఆటోస్టాండుకు వెళ్లి విచారణ చేశామంటున్నారు.

ఈ ఘటనలోదాడిచేసిన ఆటోడ్రైవర్‌ కన్పించకపోవటంతో ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పి పంపామన్నారు. తాము ఎమ్మెల్యే పర్యటన బందోబస్తుకు వెళ్లిన సమయంలో బయట నుంచే పెట్రోలు పోసుకొని స్టేషన్‌కు వచ్చి నిప్పుపెట్టుకున్నాడని చెప్పుకొచ్చారు. గమనించిన ఇద్దరు కానిస్టేబుళ్లు మంటలను ఆర్పడానికి ప్రయత్నించగా వారికి కూడా గాయాలయ్యాయి అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.