యాప్నగరం

సచివాలయానికి వెళ్లిన ఎమ్మెల్యేకు షాక్.. సిబ్బందికి అప్పటికే అలా..

D.hirehal: ఓబుళాపురం గ్రామ సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆకస్మికంగా సచివాలయం తనిఖీ చేసిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. అక్కడి పరిస్థితి చూసి అసహనం వ్యక్తం చేశారు.

Samayam Telugu 19 Oct 2021, 12:13 pm
డి.హీరేహాళ్ మండలం ఓబుళాపురం గ్రామ సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సమయ పాలన పాటించకుండా ఇష్టానుసారంగా సచివాలయానికి వచ్చి వెళుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. ఆకస్మికంగా సచివాలయం తనిఖీ చేసిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. అక్కడి పరిస్థితి చూసి అసహనం వ్యక్తం చేశారు.
Samayam Telugu ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి


ఓబుళాపురం గ్రామ సచివాలయానికి సిబ్బంది మధ్యాహ్నానికే తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. 3.30 గంటల సమయంలో సచివాలయం తనిఖీ చేసేందుకు వచ్చిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తాళం వేసి ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం పాలన పాటించకుండా తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయిన సిబ్బందిపై మండిపడ్డారు.

అనంతరం ఉన్నత అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం కార్యాలయం తెరిపించి.. రికార్డులను పరిశీలించారు. ఉద్యోగుల హాజరుశాతం ఎలా ఉందని ఆరా తీశారు. ఆయన వైసీపీ నాయకులు, స్థానికులు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.