యాప్నగరం

అవసరమైతే సీఎం జగన్‌ను కలుస్తా.. నందమూరి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని విమర్శించారు హిందూపురం ఎమ్మెల్యే. ఇప్పటికే ఐదుగురు మున్సిపల్ కమిషనర్లను మార్చారన్నారు. ఇటు ఇంటి పట్టాల పంపిణీలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందన్నారు.

Samayam Telugu 8 Jan 2021, 1:25 pm
ఎమ్మెల్యే నందమూరి బాలయ్య హిందూపురంలో మూడో రోజు పర్యటిస్తున్నారు. స్థానికులు, రైతులు, పార్టీ కార్యకర్తల్ని కలిసి స్థానిక సమస్యలపై ఆరా తీస్తున్నారు. హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని కోరారు నందమూరి బాలయ్య. అవసరమైతే ఈ విషయంపై సీఎం జగన్‌రెడ్డిని కలుస్తానని చెప్పారు.. జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తాను అంటున్నారు. హిందుపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
Samayam Telugu నందమూరి బాలయ్య


మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని విమర్శించారు హిందూపురం ఎమ్మెల్యే. ఇప్పటికే ఐదుగురు మున్సిపల్ కమిషనర్లను మార్చారన్నారు. ఇటు ఇంటి పట్టాల పంపిణీలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందన్నారు. ఆలయాలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని.. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అంతేకాదు రైతుల్ని ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. హిందూపురంను జిల్లాగా ప్రకటించాలని బాలయ్య డిమాండ్ వినిపిస్తున్నారు. గతంలో కూడా ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ కూడా రాశారు. అవసరమైతే వెళ్లి కలుస్తానని చెప్పారు. హిందూపురం టూర్‌లో మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.