యాప్నగరం

జేసీ బ్రదర్స్ ఏర్పాటు చేసిన దేవాన్ష్ ఫ్లెక్సీ చూసి లోకేష్ నవ్వులు.. పాదయాత్రలో ఆసక్తికర సీన్

Nara Lokesh Padayatra In Tadipatri Flexis వైరల్ అయ్యాయి. లోకేష్ పాదయాత్ర సందర్భంగా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్, టీడీపీ కార్యకర్తలు కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలతో పాటూ రాష్ట్రంలో పరిణామాలపై దారిపొడవునా ఫ్లెక్సీలు కనిపించాయి. ఈ క్రమంలో నారా దేవాన్ష్ ఫ్లెక్సీని లోకేష్ చూశారు.. సరదాగా నవ్వుకున్నారు. ఆ ఫ్లెక్సీలో దేవాన్ష్ ఫోటోతో పాటూ జేసీ బ్రదర్స్ మనవడు ధీర్ రెడ్డి ఫోటో కూడా ఉంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 12 Apr 2023, 7:38 am

ప్రధానాంశాలు:

  • తాడిపత్రిలో నారా లోకేష్ పాదయాత్ర
  • దారి పొడవునా ఆకట్టుకున్న ఫ్లెక్సీలు
  • దేవాన్ష్ ఫ్లెక్సీ చూసి లోకేష్ నవ్వులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nara Lokesh Tadipatri Yuva Galam
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగుతోంది. పెద్దపప్పూరులో దూదేకుల సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు. టీడీపీ హయాంలో రంజాన్‌తోఫా, దుల్హన్‌, వంటి సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నీ రద్దు చేశారన్నారు. అలాగే పెన్నానదిలో ఇసుక రీచ్‌ను పరిశీలించిన లోకేష్.. దీనిపై ప్రశ్నించిన తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy )పై కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. తన పాదయాత్ర ఉందని రెండు రోజుల నుంచి తవ్వకాలు నిలిపివేశారన్నారు లోకేష్.
మరోవైపు పెద్దపప్పూరులో జేసీ బ్రదర్స్, టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. అమరావతి, విశాఖ, కర్నూలు, పులివెందులలో ఏపీ రాజధాని ఏదో సరిగా చెప్పాలన్నారు.. చెప్పిన వారికి రూ.లక్ష బహుమతి లోకేష్ చేతుల మీదుగా అందజేస్తామని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆసక్తికరంగా మారింది. అలాగే ఇసుక అక్రమ తవ్వకాలపై మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రాష్ట్రం కోసం పదువులు త్యాగం చేశారంటూ.. ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటుగా.. ఇటీవల సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం విశేషం.

ఇదిలా ఉంటే లోకేష్ మరో ఫ్లెక్సీ చూసి నవ్వుకున్నారు. లోకేష్ పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నారా దేవాన్ష్, జేసీ బ్రదర్స్ మనవడు ధీర్ రెడ్డితో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ' మా నాన్నలు నలభైలో ఉన్నారు.. వాళ్ల స్థితే అధ్వాన్నంగా ఉంటే.. 10లో ఉన్నాం మా పరిస్థితేంటో?' అంటూ ఇద్దరి ఫోటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రేపటి బాగు కోసం కదలిరండి అని పిలుపునిచ్చారు. ఈ ఫ్లెక్సీని చూసిన లోకేష్ కొద్దిసేపు నవ్వుకున్నారు.

నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. రెచ్చగొట్టే ధోరణిలో ప్రసంగాలు చేయొద్దని కోరారు. ఈ మేరకు డీఎస్పీ వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. లోకేష్ తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో యాడికి మండలం టీడీపీ నేతకు నోటీసు ఇచ్చారు. అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే లోకేష్ పాదయాత్ర దగ్గరకు వెళ్లి తేల్చుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో లోకేష్ పాదయాత్ర సందర్భంగా అదనంగా భద్రత కల్పించారు. అటు వైఎస్సార్‌సీపీ నేతలకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కోరారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.