యాప్నగరం

అనంతపురం: కూలీలతో వెళ్తోన్న ఆటో బోలా.. ఒకరు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం

పొరుగూరులో కూలి పనులు కోసం మహిళలు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Samayam Telugu 17 Jan 2021, 8:36 am
అనంతపురం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళ్తోన్న ఆటో బోల్లా పడి ఒకరు మృతి చెందగా.. మరో 17 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గుంతకల్లు శివారులోని బళ్ళారి జాతీయ రహదారిపై కొనకొండ్ల సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. కూలీలతో వేగంగా వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వజ్రకరూరు మండలం, కొనకొండ్ల గ్రామానికి చెందిన రమణమ్మ (35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
Samayam Telugu అనంతపురం రోడ్డు ప్రమాదం


ప్రమాదంలో 17 మంది గాయపడగా వీరిలో బావమ్మ, లక్ష్మిదేవి, నాగవేణి, సుమ అనే మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మిగతా బాధితులకు గుంతకల్లు ఆస్పత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.