యాప్నగరం

TDP లో చేరేందుకు వెళ్లిన వైసీపీ నేత రాజారెడ్డి.. కిడ్నాప్ చేశారంటూ పరిటాల శ్రీరామ్, సునీత ధర్నా

Chennekothapalli Vice President Raja Reddy టీడీపీలో చేరేందుకు బయల్దేరారని చెబుతున్నారు. మార్గ మధ్యలో అతడ్ని ఎమ్మెల్యే సోదరుడు లాక్కెళ్లారని ఆరోపిస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్. రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 26 Aug 2022, 2:28 pm

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Paritala Sunitha Protest
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. చెన్నేకొత్తపల్లి పంచాయతీ YSRCP వైస్ సర్పంచ్ రాజారెడ్డి అతని మద్దతుదారులు 50 కుటుంబాలతో కలిసి వెంకటాపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ లో చేరేందుకు బయల్దేరి వెళ్లారు. అయితే మార్గ మధ్యలో కుంటిమద్ది చెరువు కట్టపై వారి వాహనాన్ని ఆపి కొంతమంది దౌర్జన్యంగా లాక్కెళ్లారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డిని దౌర్జన్యంగా తీసుకెళ్లారని చెబుతున్నారు.
రాజారెడ్డితో పాటూ ఉన్న తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ అమరేంద్ర, దుర్గప్ప, ఇతర పార్టీ నేతలపై దాడులు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనకు నిరసనగా చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళుతున్న మాజీమంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. చెన్నైకొత్తపల్లి వెళ్లడానికి అనుమతి లేదంటూ వారి వాహనాలను రామగిరి సమీపంలో పోలీసులు ఆపారు. పోలీసుల తీరును నిరసిస్తూ దీంతో పరిటాల సునీత, శ్రీరామ్‌లు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. రాప్తాడు నియోజకవర్గంలో అరాచకాలు పెరిగిపోయాయని.. ఇప్పటి వరకు ఓపికగా ఉన్నామని ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు.

టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే వేరే రకంగా వెళ్లాల్సి వస్తుందన్నారు. మరో రెండేళ్లే ఈ ప్రభుత్వం ఉంటుందని.. పోలీసులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. రాజారెడ్డి కూడా ఇబ్బందిపడి టీడీపీలో చేరాలని భావిస్తున్నారన్నారు. ఎంతోమంది పేదల భూములు లాక్కున్నారని.. మట్టి మాఫియా రెచ్చిపోతోందన్నారు. గన్‌తో టీడీపీ నేతల్ని బెదిరించారని.. పోలీసులు ఫిర్యాదు చేస్తే నిందితుల్ని అరెస్ట్ చేస్తామని చెప్పారని.. లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని తనతో చెప్పారని.. ఆ మాట మీద నిలబడాలి అన్నారు. టీడీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. కచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు బదులు తీర్చుకుంటామన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.