యాప్నగరం

Rapthadu: లోకేష్ పాదయాత్రను ఎలా తీసుకెళ్దాం.. కార్యకర్తలతో పరిటాల సునీత చర్చలు

Rapthadu: నారా లోకేష్ పాదయాత్ర.. టీడీపీకి మంచి బూస్ట్ ఇస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే తమతమ నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్రకు భారీ ఏర్పాటు చేస్తున్నారు. నెల రోజుల ముందే రూట్ మ్యాప్ సిద్ధం చేసి.. పార్టీ నాయకత్వానికి పంపిస్తున్నారు. తాజాగా.. అనంతపురం జిల్లా రాప్తాడులో.. పాదయాత్రపై సన్నాహక సమావేశం జరిగింది. మాజీ మంత్రి పరిటాల సునీత లోకేష్ పాదయాత్రపై కేడర్‌తో చర్చించారు. రూట్ మ్యాప్‌పై సలహాలు తీసుకున్నారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 22 Feb 2023, 4:32 pm

ప్రధానాంశాలు:

  • కార్యకర్తలతో పరిటాల సునీత సమావేశం
  • రాప్తాడులో లోకేష్ పాదయాత్రపై చర్చలు
  • కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలని సూచన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Paritala Sunitha
పరిటాల సునీత
Rapthadu: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్ర సమయంలో.. రాప్తాడులో టీడీపీ సత్తా చాటాలని.. మాజీ మంత్రి పరిటాల సునీత కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతపురంలోని తన ఇంట్లో.. నియోజకవర్గ ముఖ్య నేతలు, నాయకులతో సునీత భేటీ అయ్యారు. రాప్తాడు నియోజకవర్గంలో ఏయే ప్రాంతాల మీదుగా పాదయాత్ర సాగితే బాగుంటుందన్న అంశంపై చర్చలు జరిపారు. లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని Paritala Sunitha స్పష్టం చేశారు. వచ్చే నెలలో ఉమ్మడి జిల్లాకు లోకేష్‌ పాదయాత్ర చేరుకునే అవకాశం ఉండటంతో.. ఈ సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో ముందుగా కదిరి, ధర్మవరం, ఆ తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర జరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని సునీత సూచించారు. చిత్తూరు జిల్లాకు మించిన స్పందన రాప్తాడు నియోజకవర్గంలో ఉండాలని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా అధికార పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, ప్రజావ్యతిరేక విధానాల గురించి లోకేష్‌ దృష్టికి తీసుకువెళదామని.. ప్రతి గ్రామం నుంచి Nara Lokesh పాదయాత్ర సాగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని.. నాయకులు, కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.