యాప్నగరం

పరిటాల శ్రీరామ్‌కు అదే గతి పడుతుంది.. మేము రక్షించుకునే ప్రాణాలు కాబట్టి మీరంతా: ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

Raptadu Mla తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి Paritala Sriram పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర గురించి డప్పు కొట్టుకోవడం కాదని.. ప్రజలు లెక్కచేయరని గమనించాలంటూ హితవు పలికారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 13 Aug 2022, 8:49 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Paritala Sriram
రాప్తాడు రాజకీయం మరోసారి వేడెక్కింది. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (Thopudurthi Prakash Reddy).. పరిటాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రామగిరి పోలీసులపై ‘కొడకల్లారా’ అంటూ అనుచితంగా మాట్లాడిన శ్రీరామ్‌ను.. పోలీసులు కూడా తిరిగి మాట్లాడితే బావుండదన్నారు. ఆయన ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని.. పరిటాల కుటుంబ నియంతృత్వ, పెత్తందారీ పోకడలు చరిత్రలో కలిసిపోయాయన్నారు. చెన్నేకొత్తపల్లి,రామగిరి, కనగానపల్లిలో పోలీసులు నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పుడిప్పుడే ఈ ప్రాంత ప్రజల బానిస సంకెళ్లు తెగిపోయాయని.. రౌడీషీటర్లు, హంతకులు, దౌర్జన్యపరుల ఆటలు ఇక సాగవు అన్నారు.
పరిటాల సునీత తమ్ముడిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేసి పలక పట్టించిన పోలీసులు ఉన్నారని.. జాగ్రత్తగా మసలుకోకపోతే శ్రీరామ్‌కు అదే గతి పడుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. పోలీసుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న శ్రీరామ్.. గన్‌మెన్‌లు లేకుండా తిరగగలరా అంటూ ప్రశ్నించారు. అప్పుడు తెలుస్తుంది దమ్ము, ధైర్యం ఎంత ఉందో అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిటాలకు గన్‌మెన్లను పెంచిందని.. తాము రక్షించుకునే ప్రాణాలు కనుకనే స్వేచ్ఛగా తిరగనిస్తున్నాం అన్నారు. అది తెలుసుకొని మసులుకుంటే మంచిదని హితవు పలికారు. చరిత్ర గురించి డప్పు కొట్టుకోవడం కాదని.. ఈ ప్రాంత ప్రజల్ని 'మిమ్మల్ని' లెక్క చేయరని తెలుసుకోవాలన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో తాము బిజీగా ఉన్నామని.. త్వరలోనే 'మీ ఊరికి కూడా వస్తాం.. అక్కడ మీరు ఏమి చేశారు.. మా ప్రభుత్వం ఏమి చేసింది.. ఏమి చేస్తోందో ప్రజల ద్వారానే తెలుసుకుంటాము' అన్నారు. 2019 ఎన్నికల్లో 26వేల ఓట్ల తేడాతో ప్రజలు ఓడించినా మారలేదన్నారు. స్థానికం సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ చతికిలపడిందన్నారు.

నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసులపై నోరుపారేసుకోవద్దని హెచ్చరించారు ఎమ్మెల్యే. మూడు దశాబ్దాలుగా దౌర్జన్యం, రౌడీయిజంతో ప్రజలను భయపెట్టి నిర్మించుకున్న చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిందన్నారు. చంద్రబాబు, నారా లోకేష్, పార్టీ లేదు బొక్కా లేదు అని అచ్చెన్నాయుడు చెప్పినట్టు టీడీపీ చరిత్ర కూడా మసకబారిపోయింది అన్నారు. అధికారంలోకి వచ్చేస్తాం.. ఏమైనా చేసేస్తాం అనే కలలు కనడం మాని.. వాస్తవంలోకి రావాలని హితవు పలికారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.