రైతుల అవసరాన్ని మాజీ సీఎం చంద్రబాబు తన దోపిడీకి ఉపయోగించుకున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ఇరిగేషన్ అంశపై ఆయన మాట్లాడుతూ.. దాదాపు 30 ఏళ్లుగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. రాప్తాడు నియోజకవర్గం పేరూరు డ్యామ్కు నీళ్లిచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని అన్నారు. రైతులను చంద్రబాబు మోసం చేశారని.. డిస్కంలకు రూ.27 వేల కోట్లను ఎగ్గొట్టిన ఘనుడు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటిదాకా కర్నూలు జిల్లాకు 50 టీఎంసీలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు 178 టీఎంసీలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. దివంగ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే ఈరోజు రాయలసీమలో నీరు గురించి మాట్లాడుకుంటున్నామన్నారు. అనంతపురం జిల్లాలో ప్రతి చెరువూ కళకళలాడుతోందన్నారు. అప్పర్ పెన్నార్, పీఏబీఆర్, ఎంవీఆర్, జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి ప్రతి ప్రాజెక్టు నీటితో నింపామన్నారు. 34 నెలల అధికారంలో 30 నెలల పాటు హంద్రీ-నీవా కాలువ ద్వారా నీళ్లు పారించిన ఘనత ముఖ్యమంత్రిదేన్నారు.
'ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్ట్, రిజర్వాయర్కు నీళ్లొచ్చాయి. కాలువల కింద ఉన్న ప్రతి చెరువుకూ నీళ్లందాయి. పైనున్న రాజన్న కోరిక విన్నాడో ఏమో వరుణ దేవుడు కరుణించి పుష్కలంగా నీళ్లిచ్చాడు. ప్రతి ఎకరాన్ని తడిపాడు. ప్రతి చెరువుకూ నీళ్లు రావడంతో భూగర్భ జలాలు పెరిగి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతూ ఆనందంగా ఉన్నాడు..' తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన ప్రతి అంశాన్ని పూర్తి చేశారని అన్నారు. అన్ని ప్రాజెక్టులకు నిధులు కేటాయించారని తెలిపారు.
'ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్ట్, రిజర్వాయర్కు నీళ్లొచ్చాయి. కాలువల కింద ఉన్న ప్రతి చెరువుకూ నీళ్లందాయి. పైనున్న రాజన్న కోరిక విన్నాడో ఏమో వరుణ దేవుడు కరుణించి పుష్కలంగా నీళ్లిచ్చాడు. ప్రతి ఎకరాన్ని తడిపాడు. ప్రతి చెరువుకూ నీళ్లు రావడంతో భూగర్భ జలాలు పెరిగి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతూ ఆనందంగా ఉన్నాడు..' తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన ప్రతి అంశాన్ని పూర్తి చేశారని అన్నారు. అన్ని ప్రాజెక్టులకు నిధులు కేటాయించారని తెలిపారు.