యాప్నగరం

అనంతలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. కార్లు, బైకులు ఢీకొట్టి..

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు వాహనాలపైకి దూసుకెళ్లింది. బలంగా ఢీకొట్టడంతో రెండు కార్లు, బైకు ధ్వంసమయ్యాయి. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 27 Jun 2021, 2:56 pm
అనంతపురంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డుపై బైకులు, కార్లను ఢీకొడుతూ దూసుకుపోయింది. హిందూపురం నుంచి అనంతపురం వస్తున్న ఆర్టీసీ బస్సు నగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అదుపుతప్పింది. అమాంతం పక్కనే ఉన్న బైకు, కార్లపైకి దూసుకెళ్లింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. రెండు కార్లు, బైక్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
accident


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.