యాప్నగరం

ఒక్కొక్కరూ కూలిపోయారు.. టైరు మీద నిల్చొని దూకేశా: కరెంట్ షాక్ నుంచి బయటపడ్డ మహిళ

Sri Sathya Sai District: కరెంట్ తీగ తెగి ఆటోపై పడిన ఘటన సత్యసాయి జిల్లా తాడిమర్రిలో తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించారు. ప్రమాదం నుంచి బయటపడిన ఓ మహిళ ఆ ఘటన గురించి వివరించారు. ఒక్కొక్కరూ కరెంట్ షాక్‌కు గురై కుప్పకూలిపోయారని, తాను కాళ్లు ముడుచుకొని ఆటో టైర్‌పై నిల్చొని చివరికి దూకేశానని చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు ఓ ఉడత కారణమని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 2 Jul 2022, 3:51 pm
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్ తీగ తెగి ఆటోపై పడిన దుర్ఘటనలో ఐదుగురు బుగ్గిపాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి ఓ ఉడత కారణమని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఓ మహిళ జరిగిన ఘటన గురించి వివరించారు. చెప్పులేసుకుని టైరు మీదే కూర్చున్నానని.. ఒక్కొక్కరూ పడిపోతుంటే కాళ్లు ముడుచుకునే దూకేశానని తెలిపారు. కళ్ల ముందే తన వాళ్లను కోల్పోయి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
Samayam Telugu ప్రమాదం నుంచి బయటపడ్డ మహిళ
Current shock for auto in Anantapur



కరెంట్ స్తంభం పైకి ఉడత ఎక్కినప్పుడు ఇన్సులేటర్‌ నుంచి కండక్టర్‌కు షార్ట్‌ సర్క్యూట్‌ అయి మధ్యలో తీగ తెగిందని.. అదే సమయంలో అటుగా వస్తున్న ఆటోపై ఆ తీగ పడిందని ఎస్పీడీసీఎల్‌ అధికారులు వివరించారు. అయితే, తీగలు, బుడ్డీలు (ఇన్సులేటర్లు) నాసిరకంగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గ్రామ శివార్లలోని పొలాల్లో 6 నెలల కిందటే 11 కేవీ లైను ఏర్పాటు చేశారు. ఇందులో ఎల్టీ (లోటెన్షన్‌) తీగలు వాడారని స్థానికులు చెబుతున్నారు. పాత విద్యుత్ తీగలు లాగుతుండటంపై కాంట్రాక్టర్లను ప్రశ్నించినా.. వాళ్లు లెక్క చేయలేదని చెబుతున్నారు. నాసిరకం తీగలను మార్చాలని విద్యుత్తు అధికారులను కలిసి పలుమార్లు ఫిర్యాదు చేశామని.. అయినా, వాళ్లు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాదానికి ఉడుత కారణమని చెబుతున్న నేపథ్యంలో తాడిమర్రి పశు వైద్యశాలలో శుక్రవారం (జులై 1) ఉడుత కళేబరానికి డాక్టర్లు పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది!
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.