యాప్నగరం

అనంతపురం: బైక్‌ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా.. ముగ్గురికి గాయాలు

బైక్‌ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. అనంతపురం జిల్లా శింగనమల మండలం సోదనపల్లి గ్రామ శివార్లలో..

Samayam Telugu 29 Jan 2022, 3:55 pm
బైక్‌ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. అనంతపురం జిల్లా శింగనమల మండలం సోదనపల్లి గ్రామ శివార్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులెవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Samayam Telugu అనంతపురంలో ఆర్టీసీ బస్సు బోల్తా



సోదనపల్లి గ్రామం మలుపు వద్దకు రాగానే.. ఓ బైక్‌ను తప్పించబోయి బస్సు పల్టీ కొట్టి పొలాల్లోకి పడిపోయింది. అదే సమయంలో బస్సు స్టీరింగ్‌ కూడా పనిచేయలేదని తెలుస్తోంది. గాయపడిన వారిని శింగనమల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

అయితే బస్సు కండీషన్ సరిగా లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ బస్సు రెండు రోజులకు ఓ సారి చెడిపోతుందని అంటున్నారు. ఈ బస్సులో నిత్యం విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రయాణం చేస్తుంటారని.. కండీషన్ ఉన్న బస్సులు వేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి.. మంచి కండీషన్ ఉన్న బస్సులు వేయాలని కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.