యాప్నగరం

అనంతపురంలో భగ్గుమన్న పాతకక్షలు.. ఇద్దరి దారుణ హత్య

ఏపీలో ప్రతీకార దాడులు భయాందోళన కలిగిస్తున్నాయి. కర్నూలు జంట హత్యలు మరచిపోక ముందే అనంతపురంలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులను ప్రత్యర్థులు కిరాతకంగా నరికి చంపేశారు.

Samayam Telugu 19 Jun 2021, 4:25 pm
కర్నూలు జిల్లా పెసరవాయి టీడీపీ నేతల దారుణ హత్య మరువక ముందే అనంతపురంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఇద్దరు వ్యక్తులను అతి కిరాతకంగా నరికి చంపేశారు ప్రత్యర్థులు. యల్లనూరు మండలానికి చెందిన నారాయణ, రాజగోపాల్‌ను దుండగులు దారి కాచి దారుణంగా హతమార్చారు. యల్లనూరు నుంచి అరవేడు గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా వ్యాసాపురం వద్ద అడ్డగించిన ప్రత్యర్థులు కత్తులతో నరికి.. బండరాయితో మోది అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. భూతగాదాలే హత్యలకు కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu అనంతపురంలో దారుణ హత్యలు
anantapur


Also Read: అచ్చోసిన ఆంబోతులా వదిలారు.. అతనో పిచ్చికుక్క.. మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు
Read Also:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.