యాప్నగరం

అనంతపురంలో ఘోర ప్రమాదం.. ఇద్దరు దహనం

రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలి తీసుకుంది. డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు వ్యాపించడంతో లారీ మంటల్లో దగ్ధమైంది. బైక్‌పై వస్తున్న ఇద్దరు మంటల్లో కాలిపోయారు.

Samayam Telugu 27 Dec 2020, 5:24 pm
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ ఢీకొని ఇద్దరు దహనమైన విషాద ఘటన చోటుచేసుకుంది. గుత్తి మండలం ఎంగిలిబండ వద్ద లారీ బైక్‌ని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రోసిరెడ్డి, నారాయణ రెడ్డిగా గుర్తించారు. ప్రమాదంలో లారీ డీజిల్ ట్యాంక్ బద్దలై మంటలు చెలరేగడంతో ఇద్దరి మృతదేహాలు మంటల్లో దహనమయ్యాయి. అగ్నికీలలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
Samayam Telugu భారీగా ఎగసిపడుతున్న మంటలు
accident


నాలుగు రోజుల కిందట ఇలాంటి ఘటన కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలో జరిగింది. కంటైనర్ లారీకి విద్యుత్ తీగలు తగలడంతో డ్రైవర్, క్లీనర్ డోర్ తీసుకుని బయటకు దూకి ప్రమాదం నుంచి బయటపడ్డారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు లారీ నడిరోడ్డుపై నిలిపి ఉండడం చూసి ఏమైందని అడిగేందుకు డోర్ కొట్టి కరెంట్ షాక్‌తో చనిపోయారు. బైక్ పెట్రోల్ ట్యాంక్‌కి మంటలు అంటుకోవడంతో దహనమయ్యారు.

Also Read: కూతురు పెళ్లి కార్డులు ఇచ్చి వస్తూ తల్లిదండ్రులు.. నెల్లూరులో విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.