యాప్నగరం

ధర్మవరంలో దారుణం.. యువతిని చంపి పెట్రోల్‌ పోసి.! అమానుషం

పొలాల్లో యువతి మృతదేహం లభ్యమైంది. కిరాతకంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టడంతో పాక్షికంగా కాలిపోయింది. ఈ ఘటన అనంతపురంలో తీవ్ర కలకలం రేపుతోంది.

Samayam Telugu 23 Dec 2020, 1:39 pm
అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. యువతిని కిరాతకంగా హత్య చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టిన అమానుష ఘటన వెలుగుచూసింది. అనంతపురం ఎస్బీఐలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న స్నేహలత దారుణ హత్యకు గురైంది. ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద పొలాల్లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెను కిరాతకంగా హత్య చేసిన దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పాక్షికంగా తగలబడింది. . సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. సంఘటన స్థలంలో దొరికిన ఐడీ కార్డు ఆధారంగా ఆమెను స్నేహలతగా గుర్తించారు. ప్రియుడే ఆమెను కిరాతకంగా హత్య చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఆమె నిత్యం ధర్మవరం నుంచి అనంతపురం వచ్చి వెళ్తుండేదని తెలుస్తోంది. రాజేష్, కార్తీక్ అనే యువకులే తమ కూతురిని హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యువతిని చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu హత్యకు గురైన స్నేహలత, సంఘటన స్థలంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్
anantapur murder


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.