యాప్నగరం

పోలీస్‌కే వేధింపులు.. భరించలేక మహిళా కానిస్టేబుల్.. అనంతపురంలో విషాదం

భర్త వేధింపులు భరించలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసింది. అల్లుడు మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తన కూతురిని వేధించేవాడని కానిస్టేబుల్ తల్లి ఫిర్యాదు చేసింది.

Samayam Telugu 18 Feb 2021, 5:15 pm
ఎవరైనా మహిళలను వేధిస్తే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తాం. అలాంటిది ఓ మహిళా పోలీసునే వేధింపులకు గురిచేయడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ అత్యంత విషాద ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. అనంతపుర నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ శ్యామలకి భర్తతో కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నాయి. మరోమారు ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగడంతో కానిస్టేబుల్ శ్యామల అఘాయిత్యానికి ఒడిగట్టింది. భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అల్లుడి వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్యాయత్నం చేసినట్లు శ్యామల తల్లి ఆరోపిస్తున్నారు. అల్లుడు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తన కూతురిని వేధిస్తున్నాడని.. అందువల్లే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
woman


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.