యాప్నగరం

అత్తింట్లో శవమైన తేలిన కోడలు.. అనంతపురంలో మిస్టరీ మరణం

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కిచ్చి నాలుగేళ్ల కిందట వివాహం జరిపించారు. అనూహ్యంగా ఆమె ఇంట్లో శవమై తేలింది. ఆత్మహత్య చేసుకుందా? లేక హత్య చేశారా?

Samayam Telugu 8 Jan 2021, 3:59 pm
అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాద ఘటన వెలుగుచూసింది. పెళైన నాలుగేళ్లకే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుండగా.. తమ కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని శివానగర్‌కి చెందిన కళావతి, ప్రసాద్‌ల కూతురు నీరజ(25)ను నేసేపేటకి చెందిన జగదీష్‌కిచ్చి నాలుగేళ్ల కిందట వివాహం జరిపించారు. జగదీష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వారికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


పెళ్లైన కొద్దిరోజులకే నీరజకు అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు భరించలేకపోయిన ఆమె కొద్దికాలం కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. మూడు నెలల కిందట పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించి అత్తారింటికి పంపించారు. అనూహ్యంగా గురువారం రాత్రి ఆమె శవమై కనిపించింది. కూతురు చనిపోయిన విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు అల్లుడి ఇంటికి చేరుకున్నారు. అతని కుటుంబ సభ్యులను గదిలో నిర్బంధించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తలుపులు తెరిపించి వారిని విడిపించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుండగా.. అత్త, భర్త కలసి తమ కూతురిని హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆమె హత్యకు గురైందా? లేక ఆత్మహత్య చేసుకుందా? అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.