ఆ యువతిది అనంతపురం జిల్లా.. యువకుడిది ప్రకాశం జిల్లా. సోషల్ మీడియాలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది.. ఆ తర్వాత ప్రేమగా మారింది. వీడియో చాటింగ్లు చేసుకున్నారు.. కొన్నాళ్ల తర్వాత యువకుడు మొహం చాటేశాడు. యువకుడితో తనను కలపాలని యువతి అనంతపురంలోని సఖి కేంద్రం అధికారులను ఆశ్రయించారు. గుంతకల్లుకు చెందిన యువతికి ఏడాది కిందట ఫేస్బుక్లో ప్రకాశం జిల్లాకు చెందిన చిన్నా అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫేస్బుక్, వాట్సాప్ల్లో ఛాటింగ్, వీడియోకాల్స్ ద్వారా మాట్లాడుకునేవారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు యువతిని మందలించారు. ఐదు నెలల క్రితం కూడా ఆమె అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెతికి పట్టుకున్నారు. అప్పటి నుంచి ఆమె ప్రియుడిని కలవాలని భావించింది.
గత శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయి, ఫేస్బుక్ ప్రియుడి ఊరు ప్రకాశం జిల్లాకు వెళ్లారు. పైచదువులకు విజయనగరం వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ అబ్బాయి కుటుంబ సభ్యులు నచ్చజెప్పి వెనక్కి పంపారు. దీంతో ఆమె అనంతపురంలోని సఖి కేంద్రానికి వెళ్లారు. ‘తనను తన ప్రియుడితో కలపాలని’ కోరారు. అమ్మాయి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో సఖి కేంద్రం అధికారులు తల్లిదండ్రులను పిలిపించారు. ఆమె సమస్యను తెలుసుకున్న సఖి సెంటర్ మేనేజర్ శాంతామణి, సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
యువతి మాత్రం వినలేదు.. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఆ అబ్బాయిని పిలిపించి విచారిస్తారని సూచించారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆ అబ్బాయిపై కేసు పెట్టకూడదని.. కొట్టకూడదన్నారు. తనతో పెళ్లి మాత్రం చేయించాలని కోరగా.. సఖి సెంటర్ సిబ్బంది దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులుకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి, విషయం అడిగి తెలుసుకున్నారు. ఆమెను వాహనంలో గుంతకల్లుకు తీసుకెళ్లారు.
గత శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయి, ఫేస్బుక్ ప్రియుడి ఊరు ప్రకాశం జిల్లాకు వెళ్లారు. పైచదువులకు విజయనగరం వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ అబ్బాయి కుటుంబ సభ్యులు నచ్చజెప్పి వెనక్కి పంపారు. దీంతో ఆమె అనంతపురంలోని సఖి కేంద్రానికి వెళ్లారు. ‘తనను తన ప్రియుడితో కలపాలని’ కోరారు. అమ్మాయి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో సఖి కేంద్రం అధికారులు తల్లిదండ్రులను పిలిపించారు. ఆమె సమస్యను తెలుసుకున్న సఖి సెంటర్ మేనేజర్ శాంతామణి, సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
యువతి మాత్రం వినలేదు.. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఆ అబ్బాయిని పిలిపించి విచారిస్తారని సూచించారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆ అబ్బాయిపై కేసు పెట్టకూడదని.. కొట్టకూడదన్నారు. తనతో పెళ్లి మాత్రం చేయించాలని కోరగా.. సఖి సెంటర్ సిబ్బంది దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులుకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి, విషయం అడిగి తెలుసుకున్నారు. ఆమెను వాహనంలో గుంతకల్లుకు తీసుకెళ్లారు.