యాప్నగరం

Nandamuri Bala Krishna పై ఎన్నికల సంఘం, కోర్టుకు ఫిర్యాదు చేస్తా.. ఆ సర్టిఫికేట్ ఉంటే ఎమ్మెల్యేగా ఉండొచ్చా: ఇక్బాల్

Ysrcp Mlc Iqbal On Bala Krishna చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాలయ్య జీవితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిక్ష అని.. ఆ కేసును వైఎస్ పుణ్యంతోనే బయటపడ్డారన్నారు. బాలకృష్ణ సినిమాలు, రాజకీయాల్లో ఉన్నాడంటే అది ఆనాటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమన్నారు ఎమ్మెల్సీ. బాలయ్యపై ఎన్నికల సంఘానికి కోర్టుకు ఫిర్యాదు చేస్తాను అన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలపై హిందూపురం టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 27 Sep 2022, 10:55 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ysrcp Mlc Iqbal On Bala Krishna
హిందూపురం ఎమ్మెల్యే (Hindupur Mla) నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna)పై వైఎస్సార్‌సీపీ (Ysrcp) ఎమ్మెల్సీ ఇక్బాల్ (Mlc Iqbal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హతను చంద్రబాబు (Chandrababu Naidu), ఆస్తులకు వారసులమని చెప్పుకునే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు 1995 లోనే కోల్పోయారన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జీవితం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బిక్షని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్‌ని అభిమానించి గౌరవించేది వైఎస్సార్‌సీపీనే అన్నారు. ఆరోగ్య శ్రీ పేరు మార్చింది చంద్రబాబు అని.. రాజకీయం కోసం మాత్రమే ఎన్టీఆర్‌ను టీడీపీ, ఆయన కుమారులు ఉపయోగించుకుంటున్నారన్నారు. .

ప్రజల్లో ఎన్టీఆర్ పేరును తొలగించాలని మాట్లాడింది చంద్రబాబు కాదా అన్నారు ఎమ్మెల్సీ. ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయనను వేధించింది చంద్రబాబు, ఎన్టీఆర్ కుమారులే అన్నారు. బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదని గతంలో డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారని.. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండొచ్చా అంటూ ఎన్నికల సంఘానికి, కోర్టుకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై మాట్లాడే హక్కు చంద్రబాబు , బాలకృష్ణ కు లేదన్నారు.

మానసిక క్షోభతో ఎన్టీఆర్ అకాల మరణం చెందడంపై ఛార్జ్‌షీట్ ఫైల్ చేస్తే బావ, బామ్మర్దుల పేర్లు ఉంటాయన్నారు. ఓ సినీ నిర్మాతను రివాల్వర్‌తో కాల్చిన కేసులో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి పుణ్యంతోనే బాలకృష్ణ కేసు నుంచి బయటపడ్డారన్నారు. బాలకృష్ణ సినిమాలు, రాజకీయాల్లో ఉన్నాడంటే అది ఆనాటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్సీ ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బాలయ్య గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. మూడేళ్లగా హిందూపురంకు చేసింది శూన్యమని.. మిగిలిన రెండేళ్లు చేసేది కూడా ఏమీ ఉండదు అన్నారు. హిందూపురం జిల్లా కేంద్రం, మెడికల్ కాలేజీ కోసం పోరాటం చేయని వ్యక్తి అని.. అధికారం ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే బాలయ్య తన సొంత నిధులను వెచ్చించి నిత్యం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అన్నారు. రెండోసారి ప్రజలు బాలయ్యకు బ్రహ్మరథం పట్టడం ఆయన చేసిన అభివృద్ధి ప్రధాన కారణం అన్నారు. 40 ఏళ్ల దశాబ్దాల కల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారన్నారు.

అన్ని అర్హతలున్నా హిందుపురంని జిల్లా కేంద్రం ప్రకటించ లేకపోయారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఇక్బాల్.. మున్సిపల్ ఎన్నికల సమయంలో హిందూపురంని జిల్లా కేంద్రంగా చేస్తామన్నారని.. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. హిందూపురంలో కబ్జాలు, భూ పంచాయితీలు, బెదిరింపులు పాల్పడుతున్న అనుచరులపై ఎమ్మెల్సీ చర్యలు శూన్యం అన్నారు. అభివృద్ధికి పాటుపడితే స్వాగతిస్తామని.. అంతేగాని ఎమ్మెల్యేపై లేనిపోని విమర్శలు చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.