యాప్నగరం

ఉండి: ఆ కుటుంబంతో ఎవరైనా మాట్లాడితే రూ.5వేల జరిమానా.. విచిత్రమైన కారణం

Cherukuwada Village Banishment కలకలంరేపింది. ఊరి నుంచి కుటుంబాన్ని గ్రామ పెద్దలు బహిష్కరించారు. ఒకవేళ ఎవరైనా ఆ ఫ్యామిలీలో వారితో మాట్లాడితే రూ.5వేలు జరిమానా కూడా విధిస్తారు. ఊరి నుంచి వెలి వేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిపై కేసులు కూడా నమోదు చేశారు. తమను గ్రామ పెద్దల నుంచి కాడాలని ఆ బాధిత కుటుంబం కోరుతోంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 5 Dec 2022, 11:50 am

ప్రధానాంశాలు:

  • పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం
  • ఊరి నుంచి కుటుంబాన్ని వెలి వేశారు
  • ఎవరైనా మాట్లాడితే రూ.5వేలు జరిమానా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Cherukuwada
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరకువాడ గ్రామంలో సామాజిక వెలి కలకలం రేపుతోంది. ఓ కుటుంబాన్ని గ్రామ నుంచి బహిష్కరించిన పెద్దలు.. వారితో ఎవరు మాట్లాడినా 5వేల జరిమానా విధిస్తామని హుకూం జారీ చేశారు. గ్రామ పెద్ద కనకారావు తమపై కక్షగట్టి ఊరి నుంచి వెలి వేశాడని సతీశ్, రాణి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రాణితో కనకారావు అసభ్యంగా పవర్తించడంతో ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో వారిపై కక్షగట్టిన కనకారావు ఇతర గ్రామ పెద్దలతో కుమ్మక్కై ఆ కుటుంబాన్ని వెలి వేస్తున్నట్లు ప్రకటించాడు. వారితో ఎవరు మాట్లాడినా 5వేల జరిమానా విధిస్తామని గ్రామంలో చాటింపు వేయించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కనకారావు‌తో పాటు మధు మోహన్ రావు అనే వ్యక్తి పైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామ పెద్దల వేధింపుల నుంచి తమకు కాపాడి న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.