లంబసింగి నుంచి బయల్దేరిన కంటైనర్.. ఓపెన్ చేసి చూస్తే షాక్
విశాఖ జిల్లా అరకు పరిసర ప్రాంతంలో పర్యాటకుల ముసుగులో స్మగ్లింగ్ చేస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా లంబసింగి నుంచి తెలంగాణ వెళ్తున్న లారీలో భారీగా గంజాయి పట్టుబడింది.
Samayam Telugu 25 Jul 2021, 2:41 pm
విశాఖ జిల్లాలోని పర్యాటక ప్రాంతం లంబసింగి నుంచి ఓ కంటైనర్ బయల్దేరింది. తెలంగాణలోని వరంగల్కు కంటైనర్ వెళ్తోంది. రోడ్డుపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అక్కడికి వచ్చిన ఆగిన కంటైనర్ను ఓపెన్ చేసి చూస్తే షాక్. గోతాల కొద్దీ గంజాయిని చూసి పోలీసులు అవాక్కయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఈ ఘటన జరిగింది. జంగారెడ్డిగూడెం సీఐ తెలిపిన వివరాల మేరకు..
విశాఖ జిల్లా నుంచి గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. చెక్పోస్టు వద్దకు వచ్చి ఆగిన కంటైనర్ను ఓపెన్ చేసి చూడడంతో భారీగా గంజాయి బయటపడింది. కంటైనర్లో 26 బస్తాల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి విలువ రూ.25 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న కంటైనర్ని సీజ్ చేశారు. యూపీకి చెందిన మిరాజ్, దేవేందర్ సింగ్ను అరెస్టు చేశారు.
Also Read:
విశాఖ జిల్లా నుంచి గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. చెక్పోస్టు వద్దకు వచ్చి ఆగిన కంటైనర్ను ఓపెన్ చేసి చూడడంతో భారీగా గంజాయి బయటపడింది. కంటైనర్లో 26 బస్తాల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి విలువ రూ.25 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న కంటైనర్ని సీజ్ చేశారు. యూపీకి చెందిన మిరాజ్, దేవేందర్ సింగ్ను అరెస్టు చేశారు.
Also Read: