యాప్నగరం

ఏలూరులో ఎన్నికలు పెట్టండి: హైకోర్టు గ్నీన్‌సిగ్నల్.. కానీ, ఊహించని ట్విస్ట్!

ఏలూరులో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిపై ట్విస్ట్ ఇచ్చింది.

Samayam Telugu 9 Mar 2021, 6:11 pm
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మంగళవారం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఏలూరు పరిధిలోని ఓటర్ల జాబితా అంశంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్నికలు ఆపేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మంగళవారం తిరిగి విచారణ చేపట్టిన హైకోర్టు.. స్టేను ఎత్తివేస్తూ బుధవారం యథావిధిగా ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది.
Samayam Telugu ఏలూరు


అయితే, ఫలితాలకు సంబంధించి హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. ఈ నెల 10న ఎన్నికలు జరిపినా, ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 23వ తేదీకి వాయిదా వేసింది. కాగా, బుధవారం జరగాల్సిన ఎన్నికపై సోమవారం హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ విషయం తెలిసిందే. తాజాగా, ఈ స్టేను ఎత్తివేస్తూ ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని, అభ్యంతరాలను స్వీకరించకుండానే తుది ఓటర్ల జాబితాను ప్రచురించారంటూ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.