యాప్నగరం

రాష్ట్రంలోనే కాదు.. భారతదేశ చరిత్రలోనే రికార్డు: మంత్రి రంగనాథరాజు

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ..

Samayam Telugu 20 Dec 2021, 4:35 pm
సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి రేపు పశ్చిమగోదావరి జిల్లా తణుకు పర్యటనకు రానున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి రేపు ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు.
Samayam Telugu మంత్రి చెరుకువాడ రంగనాథరాజు


ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖా మంత్రి చెరుకువాడ రంగనాథరాజు మాట్లాడుతూ.. మంగళవారం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా తమ జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోనే కాదు.. భారతదేశ చరిత్రలోనే ఒకే సారి 52 లక్షల మందికి సంపూర్ణ గృహ హక్కు కల్పించడం అనేది ఇదే తొలిసారి అని ఆయన అన్నారు.

ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. 14 వేల కోట్ల రూపాయలు అప్కో ప్రభుత్వానికి రుణం ఇచ్చిందని.. 4 వేల కోట్లు లబ్ధిదారులు చెల్లిస్తే.. మిగిలిన రూ.10 వేల కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రాష్ట్రంలో రూ.4 లక్షల కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తిని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని ఆయన చెప్పారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని తమ జిల్లాలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.