యాప్నగరం

Pawan Kalyan కు ఎవరైనా నిజాలు చెప్పండయ్యా.. భీమవరం ఎమ్మెల్యే ఓ రేంజ్‌లో..!

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరోసారి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.

Samayam Telugu 25 Sep 2021, 5:41 pm
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై భీమవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్‌కు ఎవరైనా నిజాలు చెప్పండయ్యా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సినిమాలు వేరు.. వాస్తవ జీవితం వేరని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. భీమవరం మండల పరిషత్తు కార్యాలయంలో జరిగిన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్



వీరవాసరంలో గెలుపొందిన తమ వారు సంబరాలు చేసుకోకుండా అధికార పార్టీ అడ్డుపడుతోందని పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందని గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వాస్తవ విరుద్ధమైన సమాచారం ఇస్తూ పవన్‌ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సంబరాలు చేసుకోకుండా మేం ఎవరినీ అడ్డుకోలేదని.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

రాష్ట్రంలో కోవిడ్‌ నిబంధనలు పాటించాలని ఏపీ హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అందుకే తమ సొంత పార్టీ వైసీపీ నాయకులను సంబరాలకు దూరంగా ఉండాలని సూచించానని తెలిపారు. పవన్ కళ్యాణ్ దృష్టికి వాస్తవాలు తీసుకెళ్లాలని అక్కడ ఉన్న ముగ్గురు జనసేన పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్‌కు హితవు పలికారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.