యాప్నగరం

టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి కన్నుమూత

Yerra Narayana Swamy Died ఇటీవల ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమగోదావరి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న నారాయణస్వామి.. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుకాగా.. మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పదవులు దక్కాయి. నారాయణస్వామి మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి. నాంపల్లి టీడీపీ ఆవిర్భావ సభలో సంతపాన్ని తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.. టీడీపీ మాజీ మంత్రులు అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 30 Mar 2023, 5:27 am

ప్రధానాంశాలు:

  • మాజీ మంత్రి నారాయణస్వామి కన్నుమూత
  • ఇటీవల అస్వస్థత.. ఆస్పత్రిలో చనిపోయారు
  • మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Yerra Narayana Swamy Died
టీడీపీని మరో విషాదం వెంటాడింది. మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు యర్రా నారాయణస్వామి కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు భీమవరంలోని ఆసుపత్రిలో చేర్పించారు. కొంతకాలంగా అక్కడ చికిత్సపొందుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. టీడీపీలో కీలక నేతగా ఉన్న ఆయన.. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
తెలుగుదేశం సీనియర్ నాయకులు, పార్లమెంట్ మాజీ సభ్యులు యర్రా నారాయణస్వామి మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్ బ్యూర్ సభ్యులుగా, జిల్లా అధ్యక్షునిగా వివిధ హోదాల్లో పార్టీ ప్రటిష్టకు నారాయణస్వామి అవిశ్రాంతంగా కృష్టి చేశారన్నారు. మెట్ట ప్రాంతాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని.. ప్రజా జీవితంలో నారాయణస్వామి చేసిన సేవలు మరవలేనివి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

గురువారం ఉప్పులూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ ఎంపీ, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ యర్రా నారాయణ స్వామి అంత్యక్రియల్లో టీడీపీ నేతలు హాజరుకానున్నారు. పార్టీ తరపున మాజీ మంత్రులు చినరాజప్ప, పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర ఉండి నియోజకవర్గం, ఉప్పులూరులో మధ్యాహ్నం 2గంటలకు యర్రా నారాయణ స్వామి అంత్యక్రియలకు మాజీ మంత్రులు వెళతారని తెలిపారు.

నారాయణ స్వామి 1931లో ఏప్రిల్‌ 30న జన్మించారు.. సొంత ఊరు పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు. ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు.. లక్నోలో చదివివచ్చినందుకు ఆయన్ని సరదాగా సురేంద్ర నాధ్ బెనర్జీ వ్యక్తిత్వంతో పోల్చి బెనర్జీ అని పిలిచేవారు.. అలా అది ఆయన వ్యవహర నామం అయ్యింది. 1959లో ఉప్పులూరు సర్పంచిగా గెలిచారు. ఆ తర్వాత సహకార సంఘాల ఎన్నికల్లో సమీప గ్రామం ఉండి సహకార రూరల్ బ్యాంకుకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1972 లో స్థానిక సంస్థల నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

1976-78 మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1984లో టీడీపీలో చేరిన ఆయన.. రెండు సార్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా.. అనంతరం రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాదు టీడీపీ బలపడాలని ఆయనకు 1987లో జరిగిన జిల్లా పరిషత్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దింపితే, జడ్పీ చైర్మన్ పదవి పోటీలోఘన విజయం సాధించారు. అంతేకాదు నారాయణస్వామి టీడీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా.. పోలవరం ప్రాజెక్టు సాధన కమిటీ ఛైర్మన్‌గా సేవలందించారు. 2005 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.