యాప్నగరం

ఏలూరు జిల్లాలో విషాదం.. ఉపాధి కోసం వెళ్లిన నలుగురు కూలీలు దుర్మరణం

ఉపాధి కోసం కాకినాడ జిల్లా నుంచి ఏలూరు జిల్లాకు వచ్చిన కూలీలు. జామాయిల్ తోట నరకడం కోసం వచ్చారు.. నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 17 Aug 2022, 9:43 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Eluru District
ఏలూరు జిల్లాలో విషాదం జరిగింది. లింగపాలెం మండలం బోగోలులో పిడుగుపడి నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా జామాయిల్‌ కర్రలు నరికేందుకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ 30 మంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఘటన జరిగింది. మృతులు రాయుడు రాజు, కోనపు రెడ్డి శ్రీనివాసు, గుత్తులకొండ బాబుగా గుర్తించారు. వీరందరు కాకినాడ జిల్లాకు చెందిన కూలీలుగా చెబుతున్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.