యాప్నగరం

వర్షంలో బ్రేక్, ఆగని వాహనం.. ప్రాణం నిలిపిన వార్నింగ్ బోర్డు!!

విజయవాడ నుంచి లోడుతో వెళ్తున్న ట్రక్కు అమాంతం అదుపుతప్పి బోల్తా కొట్టింది. తలకిందులుగా పడినా డ్రైవర్ స్వల్ప గాయలతో బయటపడ్డాడు. హెచ్చరిక బోర్డు తన ప్రాణాలు కాపాడిందని చెప్పాడు.

Samayam Telugu 11 Jun 2021, 4:55 pm
జోరుగా వర్షం.. వేగంగా వస్తున్న వాహనం.. సడెన్‌గా బ్రేక్ వేయడంతో రోడ్డు మీద తడికి బండి ఆగలేదు. అదుపుతప్పి అంతే ఈడ్చుకెళ్లి బోల్తా కొట్టింది. చివరికి వాహనదారులను అప్రమత్తం చేసేందుకు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డే ఆ డ్రైవర్ ప్రాణాలు నిలిపింది. రోడ్డు దిగి పల్టీలు కొట్టకుండా అడ్డుకోవడంతో గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.
Samayam Telugu బోల్తా కొట్టిన ట్రక్కు
overturn


విజయవాడ నుంచి సేమ్యా లోడుతో వెళ్తున్న మినీ ట్రక్ భీమడోలు ఫైర్ స్టేషన్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. వాహనం తలకిందులుగా పడింది. డ్రైవర్ కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. వర్షం కురవడంతో బ్రేక్ వేశానని.. అయినా వాహనం ఆగలేదని డ్రైవర్ చెప్పాడు. రోడ్డు పక్కనే ఉన్న హెచ్చరిక బోర్డుని ఢీకొట్టి వాహనం ఆగిందని.. లేకుంటే తన ప్రాణాలు పోయేవని డ్రైవర్ పేర్కొన్నాడు. వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఏర్పాటు చేసిన బోర్డు ఒక నిండుప్రాణాన్ని కాపాడింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.