యాప్నగరం

ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సొంత నియోజకవర్గంలోనే షాక్.. రోడ్డెక్కిన జనాలు!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సొంత నియోజకవర్గ ప్రజలే ఆదివారం ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు.

Samayam Telugu 13 Jun 2021, 11:33 pm
Samayam Telugu ఎంపీ రఘురామకు వ్యతిరేకంగా నిరసన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణరాజుకు సొంత నియోజకవర్గంలోనే షాక్ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ఏపీ బహుజన ఐక్య వేదిక వెల్లడించింది. రెండేళ్లుగా నియోజకవర్గ ప్రజలను, అభివృద్ధిని పట్టించుకోని రఘురామ కృష్ణరాజును తక్షణమే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేసింది.

ఓట్లేసి ఎన్నుకున్న ఎంపీ తమను మోసం చేశాడంటూ నియోజకవర్గానికి చెందిన ప్రజలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం రఘురామకృష్ణరాజుపై ఏలూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ రఘురామ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Sri Reddy: శృంగార తారను కుల దేవతగా ఎన్నుకున్న రెడ్లు, ఆమె ఫొటోలు రకరకాల భంగిమల్లో.. ఎంపీ రఘురామ ఓ రేంజ్‌లో!
ఇదిలా ఉండగా, దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ రఘురామ కృష్ణరాజుపై పలువురు ఫైరయ్యారు. ఈ మేరకు ఆదివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలోని గరగపర్రు గ్రామానికి చెందిన దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామ కృష్ణరాజును తక్షణమే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రఘురామ కృష్ణరాజు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.