యాప్నగరం

రాత్రిళ్లు వింత జంతువు సంచారం.. భయం గుప్పిట్లో జనం

పొలాల్లో కట్టి ఉంచి ఉన్న లేగ దూడలపై రాత్రి పూట వింత జంతువు దాడి చేస్తోంది. తాజాగా శనివారం రాత్రి కూడా ఓ దూడపై జంతువు దాడి చేసి హతమార్చింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 11 Apr 2021, 11:35 am
పశ్చిమగోదావరి జిల్లాలో వింత జంతువు కలకలం రేపుతోంది. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామంలో వింత జంతువు సంచారం జనంలో గుబులు రేపుతోంది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.రాత్రి సమయాల్లో సంచరిస్తూ పొలాల్లో కట్టేసి ఉంచిన లేగా దూడలపై దాడి చేస్తుండటంతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.
Samayam Telugu వింత జంతువు దాడి


అయితే గుర్తు తెలియని జంతువు నిన్న రాత్రి సమయంలో కూడా హల్ చల్ చేసింది. మరో లేగ దూడ పై దాడి చేసి చంపింది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు స్పందించి గుర్తు తెలియని జంతువుని బంధిచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రి పూట పశువుల్ని ఆరుబయట ఉంచాలంటేనే భయంగా ఉందని చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.