యాప్నగరం

ఏలూరు: ఐటీడీఏ పీఓపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. కలెక్టర్ కీలక నిర్ణయం

ఇద్దరు మధ్యవర్తులు ఉద్యోగం ఇప్పిస్తామని కేఆర్ పురం ఐటీడీఏ ఉన్నతాధికారి వద్దకు తనను తీసుకెళ్లారని.. ఉద్యోగం కోసం ఆశతో గత్యంతరం లేక ఆయనకు లొంగిపోయానని బాధితురాలు ఆరోపించింది.

Samayam Telugu 13 Jun 2021, 7:32 am
ఉద్యోగం ఇప్పిస్తామంటూ తనను కె.ఆర్‌.పురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో) లొంగదీసుకుని మోసం చేశాడంటూ ఏలూరుకు చెందిన యువతి శనివారం విడుదల చేసిన సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. శారీరక వాంఛలు తీర్చుకుని ఉద్యోగం ఇవ్వలేదని.. వెళ్లిన ప్రతిసారీ మళ్లీ కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. యువతి ఆరోపణలపై స్పందించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా.. ఐటీడీఏ పీవో విషయంలో నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu ఏలూరు ఘటన


పీఓ ఆర్వీ సూర్యనారాయణను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నలక్ష్మిని ఇన్‌ఛార్జిగా నియమించారు. అలాగే మెజిస్టీరియల్‌ విచారణ బాధ్యతలను ఏలూరు ఆర్డీవో పి.రచనకు అప్పగించారు. మరోవైపు, పీవోపై ఆరోపణలు చేసిన యువతి మరో వాట్సప్‌ వీడియోలో భిన్నమైన కథనం వినిపించడం చర్చనీయాంశమైంది.

పోస్టింగ్‌ పెడితే ఉద్యోగం వస్తుందంటూ ఇద్దరు వ్యక్తులు తనను ప్రేరేపించారని మరో వీడియోలో తెలిపింది. తన వ్యక్తిగత వీడియోలు కొన్ని ఉన్నాయంటూ వారు బెదిరించి వీడియో తీయించి వాట్సప్‌లో పంపేలా చేశారని పేర్కొంది. అయితే, పీవోపై తాను చేసిన అభియోగాలు వాస్తవం కాదని అందులో ఆమె వెల్లడించడం గమనార్హం. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలవరం డీఎస్పీ లతాకుమారి, సీఐ మూర్తి వివరాలు తెలుసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.