యాప్నగరం

ప.గో: రాత్రి డాబాపై నిద్రపోయారు.. తెల్లవారాక కిందకు వచ్చి చూడగానే షాక్

మంగళవారం తెల్లవారుజామున మంచినీళ్ల కోసం సూర్యనారాయణ కిందకు వచ్చేసరికి ఇంటి, బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. అవాక్కైన ఆయన లోపలికి వెళ్లి చూశాడు

Samayam Telugu 12 May 2021, 11:43 am

ప్రధానాంశాలు:

  • బొమ్మిడిలో భారీ దొంగతనం
  • ఇంట్లో గోల్డ్, వెండి ఎత్తుకెళ్లారు
  • ఉదయం చూసి అంతా షాక్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu పశ్చిమగోదావరి జిల్లా
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ చోరీ కలకలంరేపింది. ఉంగుటూరు బొమ్మిడికి చెందిన సాతవల్లి సూర్యనారాయణ ఇంటి తలుపునకు గడియ పెట్టి కుటుంబ సభ్యులతో కలిని నిద్రించేందుకు సోమవారం రాత్రి డాబాపైకి వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున మంచినీళ్ల కోసం సూర్యనారాయణ కిందకు వచ్చేసరికి ఇంటి, బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. అవాక్కైన ఆయన లోపలికి వెళ్లి చూశాడు.. లోపల బీరువా దగ్గర వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.
బీరువా తీసి చూడగా అందులోని 23 తులాల బంగారు ఆభరణాలు, పావు కిలో వెండి వస్తువులు కనిపించలేదు. దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. ఎండాకాలం కావడంతో అందరూ డాబాలపై పడుకుంటున్నారు. ఈ క్రమంలో చోరీలు ఎక్కువయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.