యాప్నగరం

ఆకివీడులో అమానుషం, కరోనా అనుమానంతో ఇంటి నుంచి గెట్టివేత.. రాత్రంతా శ్మశానంలోనే..!

పశ్చిమ గోదావరి జిల్లాలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానంతో తల్లికొడుకు పట్ల దారుణంగా..!

Samayam Telugu 21 Apr 2021, 11:29 pm
ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మనుషులు ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి ఈ కష్టకాలంలో కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కనీస మానవత్వం మరిచిపోయి దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే నెల్లూరులో కరోనా సోకిన వారిని ఎదురింటి వ్యక్తి ఇంట్లో పెట్టి బయట తాళం వేసిన సంఘటనను మరువక ముందే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది.
Samayam Telugu ఆకివీడులో శ్మశానం వద్ద తల్లీకొడుకు


పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఇంట్లో అద్దెకు ఉంటున్న వీరమ్మ అనే వృద్ధురాలు, ఆమె కొడుకును కరోనా ఉందనే అనుమానంతో యజమానులు ఇంటి నుంచి బయటకు గెంటివేశారు. దీంతో స్థానికులు వారిని గ్రామంలోని ఓ క్రైస్తవ శ్మశానంలో వదిలిపెట్టారు. ఆ సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక.. తల్లీకొడుకు ఇద్దరూ రాత్రి అంతా శ్మశానంలోనే గడిపారు. ఈ విషయం చుట్టుపక్కల వారికి, తర్వాత గ్రామస్తులందరికీ తెలిసింది.

చివరకు, ఈ విషయం చివరకు పోలీసులకు చేరింది. వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు.. ఆ ఇంటి యాజమానిని హెచ్చరించారు. అనంతరం గ్రామస్తులకు కరోనాపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత వీరమ్మ, అతని కుమారిడిని ఆటోలో అద్దె ఇంటికి తరలించారు. ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.