యాప్నగరం

గోదారోళ్లకి జగన్ గుడ్‌న్యూస్.. రివీల్ చేసిన వైసీపీ ఎంపీ

చేపలు, రొయ్యల చెరువులకు ఫేమస్ అయిన గోదావరి జిల్లాలో ప్రతిష్టాత్మక వర్సిటీ ఏర్పాటు కానుంది. 300 కోట్లకి పైగా నిధులతో వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు.

Samayam Telugu 24 Jul 2021, 2:25 pm
గోదారోళ్లకి జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వందల కోట్లతో ప్రతిష్టాత్మక ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి తమకే పక్కలో బల్లెంలా తయారైన రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు ఇలాకాలోనే వర్సిటీ ఏర్పాటు చేయనుండడం విశేషం. వర్సిటీకి అనుబంధంగా మత్స్యకారులు అధికంగా ఉన్న శ్రీకాకుళం జిల్లా పలాస, కొల్లేరు ప్రాంతానికి సమీపంలోని కైకలూరులో ఫిషరీస్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. వర్సిటీ ఏర్పాటును వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రివీల్ చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
narsapur


పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వద్ద 332 కోట్ల రూపాయలతో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారని విజయాసాయి తెలిపారు. నలభై ఎకరాల్లో నిర్మించే ఈ వర్సిటీలో అక్వా రంగానికి సాయపడే పరిశోధనా సంస్థలు వస్తాయని చెప్పారు. వర్సిటీకి అనుబంధంగా పలాస, కైకలూరుల్లో ఫిషరీస్ కాలేజీలు నెలకొల్పుతారని ఎంపీ విజయసాయి తెలియజేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.