యాప్నగరం

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు

గుంటూరు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ ట్రాక్టర్ పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడటంతో ఆరుగురు దుర్మరణం చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

Samayam Telugu 5 Jun 2023, 4:34 pm
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. దాదాపు 20 మంది గాయపడ్డారు. ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరో ముగ్గురు చనిపోయారు. ట్రాక్టర్‌లో సుమారు 40 మంది చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Samayam Telugu బోల్తా పడిన ట్రాక్టర్


బాధితులను ప్రత్తిపాడు మండలం కొండెపాడు వాసులుగా గుర్తించారు. మృతులు మిక్కిలి నాగమ్మ, మామిడి జాన్సీరాణి, కట్టా నిర్మల, గరికపూడి మేరిమ్మ, గరికపూడి రత్నకుమారి, గరికపూడి సుహాసినిగా గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.