యాప్నగరం

కోడెల కుటుంబానికి చంద్రబాబు ద్రోహం చేశారు.. ఆత్మహత్యకు కారణం కూడా ఆయనే: మంత్రి అంబటి

Chandrababu Sattenapalli Tour లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. జనాలే లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబే రాజకీయ సైకో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోడెల కుటుంబానికి ద్రోహం చేశారని.. ఆయన కంటే సైకో ఇంకెవరున్నారని ఘాటుగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కూడా చంద్రబాబు కారణమన్నారు. ఆయన చెప్పవన్నీ పచ్చి అబద్దాలని మంత్రి విమర్శించారు

Authored byతిరుమల బాబు | Samayam Telugu 27 Apr 2023, 2:05 pm

ప్రధానాంశాలు:

  • చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్
  • కోడెల కుటుంబానికి బాబు ద్రోహం చేశారు
  • పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Chandrababu Sattenapalli Tour
సత్తెనపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. సత్తెనపల్లి సభకు జనం రాకపోయినా అద్భుతం అనడం చంద్రబాబు ఖర్మ.. సభకు జనం నుంచి స్పందన కరువైంది అన్నారు. ఆయన ఒక్క నిజమైనా చెప్పారా.. అన్నీ అబద్ధాలే చెబుతారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని ముని శాపం ఉందని వైఎస్ రాజశేఖరెడ్డి చెబుతుండేవారన్నారు.
చంద్రబాబును మించిన సైకో ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని.. ఒక ముసలి సైకో.. ఒక రాజకీయ సైకో.. అధికారం లేకుండా ఉండలేని సైకో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పేదల్ని ధనవంతుల్ని చేశారా అని ప్రశ్నించారు. బాబు.. ఎక్కడ పుట్టారు.. ఎక్కడ పెరిగారు.. అలాంటిది సత్తెనపల్లి వచ్చి తనపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.

చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యమైందన్నారు. కాఫర్‌ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్‌ కట్టారని.. చంద్రబాబు తప్పిదం వల్ల రూ.2వేల కోట్లు నష్టం జరిగింది అన్నారు. రెక్కల కష్టంలో పార్టీని నిలబెట్టిన జగన్‌ అనర్హులా?.. చంద్రబాబు, నారా లోకేష్‌ మాత్రమే అర్హులా? అన్నారు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు చంద్రబాబే కారణమని.. కోడెల ఉరివేసుకోవడానికి ప్రధాన కారణం ఆయనే అంటూ విమర్శించారు. ఆయన కుటుంబానికి చంద్రబాబు ద్రోహం చేశారన్నారు.
సత్తెనపల్లిలో జరిగిన సభలో చంద్రబాబు మంత్రి అంబటి రాంబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్‌లో డయాఫ్రం వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అని ఎద్దేవా చేశారు. పోలవరం కుడికాలువలో గట్లు కోట్టేస్తున్నారని.. గట్లు మాయం అవుతున్నాయన్నారు. దీనిపై హైకోర్టు చీవాట్లు పెట్టిందని.. దీనికి మంత్రి సమధానం చెపుతారా అని ప్రశ్నించారు. నోరు ఉందని రంకెలు వేస్తే లాభం లేదని ఆ మంత్రి తెలుసుకోవాలని.. పెదకూరపాడు...సత్తెనపల్లి రోడ్డు వేయలేని నువ్వు టీడీపీని విమర్శిస్తారా అన్నారు. జగన్ ఆనందం కోసం రోజూ పవన్ కళ్యాణ్‌తో పాటూ తనని మంత్రి విమర్శిస్తుంటారన్నారు. మంత్రి అంబటి రాంబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అన్నారు. సత్తెనపల్లిలో డ్రైనేజ్ పనికి వెళ్లి బీసీ వర్గానికి చెందిన అనీల్ చనిపోతే.. అతడికి వచ్చిన 5 లక్షల ఆర్థిక సాయంలో మంత్రి వాటా అడిగాడా లేదా.. తల్లి దండ్రుల ఘోషకు సమాధానం చెప్పాలన్నారు.

రాజు పాలెం మండలంలో మంత్రి అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని వాళ్ల పార్టీనాయకులే కోర్టుకు వెళ్లారన్నారు. నియోజవకర్గంలో అపార్ట్మెంట్ అయినా.. వెంచర్ వేసినా మంత్రికి వాటా ఇవ్వల్సిందే అని ఆరోపించారు. అంబటి తమ్ముడు మొన్నటి వరకు చాలా యాక్టివ్‌గా ఉన్నారని.. ఇప్పుడు ఎందుకు యాక్టివ్‌గా లేరో మంత్రి చెప్పాలన్నారు. పేదల ఇళ్ల స్థలాల్లో వీళ్ల మనుషులు 10 కోట్లు కొట్టేశారని.. కమిషన్ ఇవ్వలేదని ముగ్గు మిల్లులు మూత వేశారన్నారు. సత్తెనపల్లె మీటింగ్ చూసిన తరువాత.. వైఎస్సార్‌సీపీ ఓడిపోవడం ఖాయం అన్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.