యాప్నగరం

కొడుకు కిడ్నాప్.. ఫిర్యాదు చేద్దామని వెళ్తుంటే పోలీసుల ఫోన్.. షాకింగ్

ఉదయాన్నే లేచిచూసేసరికి కొడుకు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోయింది. భీమవరం పోలీస్‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసేందుకు తండ్రి వెళ్తుండగా తాడేపల్లి పోలీసులు ఫోన్ చేశారు.

Samayam Telugu 21 Jul 2021, 6:03 pm
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని అపహరించి కారులో తీసుకెళ్లారు. దుండగుల చెర నుంచి తప్పించుకున్న బాలుడు గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో ప్రత్యక్షమయ్యాడు. దుండగులు కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకొచ్చారని.. తాను తప్పించుకుని వచ్చినట్లు బాలుడు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాలుడి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు వెంటనే అతని తండ్రి కమతం రవికి ఫోన్ చేశారు. ఉదయం లేచి చూసేసరికి తన కొడుకు ఇంట్లో కనిపించలేదని బాలుడి తండ్రి తెలిపారు. భీమవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా తాడేపల్లి పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని ఆయన చెప్పారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kidnap


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.