యాప్నగరం

అత్యాచార బాధితురాలికి చెల్లని చెక్కు.. జగన్ సర్కార్‌పై మహిళా నేత సంచలన ఆరోపణలు

తాడేపల్లి అత్యాచారం ఘటనలో నేటికీ నిందితులను అరెస్టు చేయకపోవడం జగన్ సర్కార్ వైఫల్యమని నిర్మల ఆరోపించారు. మహిళా హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో అత్యాచార ఘటనలు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.

Samayam Telugu 30 Jun 2021, 7:25 pm
గుంటూరు జిల్లా తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాబోయే భర్తతో సరదాగా నదీ తీరానికి వచ్చిన యువతిని తాళ్లతో కట్టేసి ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. గ్యాంగ్ రేప్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం జగన్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలికి నష్టపరిహారం కూడా అందజేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
girl


అయితే బాధితురాలికి ప్రభుత్వం అందించిన నష్టపరిహారం చెక్కుపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లినేని నిర్మలా కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. తాడేపల్లి అత్యాచార బాధితురాలికి జగన్ సర్కార్ చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిందని నిర్మల ఆరోపించారు. ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా నేటికీ నిందితులను పట్టుకోలేకపోవడం ప్రభుత్వం వైఫల్యమని ఆమె విమర్శించారు. సీఎం జగన్ ఇంటికి సమీపంలోనే ఈ దారుణం జరగడం శోచనీయమని.. జగన్ ప్రభుత్వం హయాంలో 455 అత్యాచార ఘటనలు జరిగాయని ఆమె అన్నారు. ఇప్పటి వరకూ ఎన్ని కేసులు పరిష్కరించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.