యాప్నగరం

వృద్ధురాలిని బస్సు నుంచి తోసేసిన కండక్టర్.. ఏపీలో ఘోరం!

కనీసం వృద్ధురాలు అని కూడా చూడకుండా ఓ కండక్టర్ ఆమెను బస్సు నుంచి కిందకు తోసేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈ అమానుష సంఘటన చోటుచేసుకుంది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 4 Mar 2023, 4:34 pm
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ బస్సు కండక్టర్ ఓ వృద్ధురాలి పట్ల అరాచకంగా ప్రవర్తించించాడు. బస్సు నుంచి త్వరగా దిగాలంటూ ఆమెను మెట్లపై నుంచి కిందకు తోసేశాడు. ఈ క్రమంలో కిందపడ్డ బాధితురాలు స్వల్పంగా గాయాలపాలయ్యారు.
Samayam Telugu సత్తెనపల్లిలో వృద్ధురాలిని బయటికి తోసేసిన కండక్టర్


సత్తెనపల్లి డిపో వద్ద వృద్ధురాలు బస్సులో నుంచి దిగుతున్న సమయంలో కండక్టర్ ఆమెను తొందరపెడుతూ బస్సులో నుంచి తోసేశాడని సమాచారం. దీంతో వృద్ధురాలు బోర్లా పడటంతో ఆమె ముఖానికి గాయాలయ్యాయి. కింద పడ్డ బాధితురాలిని పైకి లేపే ప్రయత్నం కూడా చేయకుండా బస్సును ముందుకు పోనిచ్చారన్న ఆరోపణలు వస్తున్నారు.

మరోవైపు, కండక్టర్‌ తీరుకు నిర్ఘాతపోయిన వృద్ధురాలు కన్నీటి పర్యంతమయ్యారు. కింద పడ్డ వృద్ధురాలికి గాయాలవడంతో స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కండక్టర్ తీరు పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులు కండక్టర్‌పై డిపో అధికారులు, ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.