యాప్నగరం

కేంద్రంపై పోరాటం చేస్తే జగన్‌కి టీడీపీ సపోర్ట్.. మాజీ మంత్రి ఇంట్రస్టింగ్ కామెంట్స్

Samayam Telugu 8 Dec 2021, 12:46 am
ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కేంద్రంతో పోరాటం చేస్తే.. ఆ పోరాటానికి టీడీపీ కూడా సపోర్ట్ చేస్తుందని.. రైతుల విషయంలో అందరం కలిసికట్టుగా పోరాడదామంటూ మాజీ మంత్రి జవహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం తెలిపారు. అక్కడ కేసీఆర్ యాసంగి పంట వేయొద్దంటే.. ఇక్కడ జగన్ వరి వేయొద్దంటున్నారని.. అన్న కేసీఆర్ ఏది చేస్తే జగన్ ఇక్కడ అది చేస్తారంటూ ఎద్దేవా చేశారు.
Samayam Telugu కే ఎస్ జవహర్


అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను జగన్‌మోహన్ రెడ్డి అస్తవ్యస్తంగా మార్చారని.. రాష్ట్రంలో వరికి ఉరేసే పరిస్థితి తీసుకొచ్చారంటూ జవహర్ విమర్శించారు. రైతు ఆత్మహత్యలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందని.. అలాంటి పరిస్థితుల్లో్ వరి పంట వేయొద్దనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. బోర్ల కింద వరి వేయొద్దంటే వ్యవసాయ రంగం కుదేలవుతుందని.. కేసీఆర్‌ని ఫాలో అవుతూ ఏపీ రైతులకు నష్టం చేకూరుస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు పట్టిసీమతో నీళ్లు తీసుకొచ్చి రైతులకు మేలు చేకూర్చారని.. ఈ గవర్నమెంట్‌లో వరికి ఉరేస్తున్నారని జవహర్ వ్యాఖ్యానించారు. రియల్ టైం గవర్నెన్స్ చంద్రబాబు టైంలో ఉంటే.. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని గవర్నెన్స్ చేస్తున్నారంటూ విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు కనీస అవగాహన లేదని.. రైతులకు గిట్టుబాటు ధర పక్కనపెట్టి.. కనీసం ఉన్న పంటను కొనే పరిస్థితి చూడాలన్నారు. రైతు మెడకు ఉరి బిగించే విధంగా.. మోటర్లకు మీటర్లు బిగించి వాటి ద్వారా లబ్ధిపొందాలని ప్రభుత్వం ఉందని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.