Guntur: ఉమ్మడి గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు అమ్మాయిలపై రోజుల తరబడి నకిలీ పూజారి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పూజల ద్వారా డబ్బు వస్తుందని ముగ్గురు అమ్మాయిలతో నగ్న పూజలు చేయించడంతో పాటు వారిపై అత్యాచారానికి పాల్పడిన విషయం బయటపడింది. ఈ కేసులో చిలకలూరిపేటకు చెందిన మహిళ సూత్రధారిగా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.
గుంటూరు, విజయవాడ, ఒంగోలులోని లాడ్జిలో అమ్మాయిలను నగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పూజల మధ్యలో లేస్తే వచ్చే లక్ష రూపాయలు రాకుండా పోతాయని అమ్మాయిలను నకిలీ పూజారి, మహిళ నిలువునా మోసం చేసినట్లు గుర్తించారు. చివరికి వీరి మోసాన్ని పసిగట్టిన అమ్మాయిలు.. 'దిశ' యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వ్యవహారం బెడిసి కొట్టడంతో అమరావతి రోడ్డులోనీ హోసన్నా మందిరం సమీపంలో ముగ్గురు అమ్మాయిలను నకిలీ పూజారి వదిలేసి వెళ్లిపోయాడు.
'దిశ' యాప్ ద్వారా సమాచారం అందుకుని నల్లపాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని అమ్మాయిలను రక్షించారు. అనంతరం బాధిత అమ్మాయిలను పోలీస్ స్టేషన్కు తరలించి రక్షణ కల్పిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో ముగ్గురు యువకుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆ యువకుల పాత్ర ఏంటి? అమ్మాయిలకు మహిళ ఎలా పరిచయం అయింది? అనే విషయాలపై పోలీసులు అరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
చిలకలూరిపేటకు చెందిన మహిళకు గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామానికి చెందిన నకిలి పూజారి సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. నకిలీ పూజారితో విజయవాడ, గుంటూరు, ఒంగోలు లాడ్జిల్లో యువతులతో ఆమె నగ్న పూజలు చేయించారు. అనతికాలంలోనే అధికంగా డబ్బును సంపాదించాలనే ఆశతో మహిళను కొంతమంది అమ్మాయిలు ఆశ్రయించారు. దీంతో నకిలీ పూజారిని మహిళ రంగంలోకి దింపింది. గతకొన్ని రోజులుగా నగ్న పూజల పేరుతో అమ్మాయిలపై నకిలీ పూజారి అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది.
గుంటూరు, విజయవాడ, ఒంగోలులోని లాడ్జిలో అమ్మాయిలను నగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పూజల మధ్యలో లేస్తే వచ్చే లక్ష రూపాయలు రాకుండా పోతాయని అమ్మాయిలను నకిలీ పూజారి, మహిళ నిలువునా మోసం చేసినట్లు గుర్తించారు. చివరికి వీరి మోసాన్ని పసిగట్టిన అమ్మాయిలు.. 'దిశ' యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వ్యవహారం బెడిసి కొట్టడంతో అమరావతి రోడ్డులోనీ హోసన్నా మందిరం సమీపంలో ముగ్గురు అమ్మాయిలను నకిలీ పూజారి వదిలేసి వెళ్లిపోయాడు.
'దిశ' యాప్ ద్వారా సమాచారం అందుకుని నల్లపాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని అమ్మాయిలను రక్షించారు. అనంతరం బాధిత అమ్మాయిలను పోలీస్ స్టేషన్కు తరలించి రక్షణ కల్పిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో ముగ్గురు యువకుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆ యువకుల పాత్ర ఏంటి? అమ్మాయిలకు మహిళ ఎలా పరిచయం అయింది? అనే విషయాలపై పోలీసులు అరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.