యాప్నగరం

పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

Pondugula Auto Accident నల్గొండ జిల్లా నుంచి కూలీలు పల్నాడు జిల్లాకు వస్తున్నారు.. పొందుగల దగ్గర ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం, ఏడుగురికి తీవ్ర గాాయాలు అయ్యాయి.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 17 May 2023, 1:12 pm

ప్రధానాంశాలు:

  • పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలో ప్రమాదం
  • ఐదుగురు దుర్మరణం, ఏడుగురికి తీవ్ర గాయాలు
  • బాధితులంతా నల్గొండ జిల్లాకు చెందినవారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Dachepalli Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాచేపల్లి మండలం పొందుగల దగ్గర మిర్చీ కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఘటనలో క్షతగాత్రుల్ని హుటా హుటిన గురజాల, మిర్యాలగూడ ఆస్పత్రులకు తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23మంది ఉన్నారు. వీరు గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వీరంతా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నరసాపురంకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన పొందుగల ప్రాంతం ఏపీ, తెలంగాణకు మధ్య సరిహద్దుగా ఉంది. ఈ ఆటో ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.