ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ.. గుంటూరు జిల్లా తాడికొండ వైఎస్సార్సీపీ ( Tadikonda Ysrcp)లో గ్రూప్ వార్ మరింత ముదిరింది. నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ (Dokka Manikya Varaprasad) నియామకంతో.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) వర్గం భగ్గుమంది. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. నియోజకవర్గంలో రెండు వర్గాలు పోటా పోటీగా కార్యక్రమాలు చేస్తున్నాయి. తాజాగా నియోజకవర్గ వైఎస్సార్సీపీ అదనపు ఇంఛార్జ్గా డొక్కా మాణిక్య వరప్రసాద్ నియామకాన్ని నిరసిస్తూ తాడికొండలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మద్దతుదారులు ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. వీరికి పోటీగా ఎమ్మెల్సీ డొక్కా వర్గం కూడా అక్కడికి చేరుకుంది. దీంతో పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇరు వర్గాల మోహరించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.. తాడికొండలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. రెండు వర్గాలకు నచ్చజెప్పారు.
ఒకవేళ పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలి తప్ప.. ఇలా రోడ్కెక్కకూడదన్నారు. కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాడికొండలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ నియిమాకాన్ని ఒప్పుకునేది లేదని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గం అంటోంది. ఈ గ్రూప్ వార్కు వైఎస్సార్సీపీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి.
ఒకవేళ పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలి తప్ప.. ఇలా రోడ్కెక్కకూడదన్నారు. కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాడికొండలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ నియిమాకాన్ని ఒప్పుకునేది లేదని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గం అంటోంది. ఈ గ్రూప్ వార్కు వైఎస్సార్సీపీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి.