యాప్నగరం

గుంటూరులో రోడ్డెక్కిన జూనియర్ డాక్టర్లు.. అసలేం జరిగిందంటే..?

Samayam Telugu 10 Dec 2021, 7:50 am
గుంటూరులో జూనియర్ డాక్టర్లు (జూడా) రోడ్లపైకి నిరసన చేపట్టారు. గత రెండ్రోజులు ఆందోళన కొనసాగిస్తున్న జూడాలు ఈ రోజు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ఎదుట ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేసే వరకూ విధుల్లోకి హాజరుకామంటూ భీష్మించుకు కూర్చున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


గుంటూరు గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో ఓ రోగి బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడి చేశారు. దీంతో దాడిని నిరసిస్తూ మూడ్రోజులుగా జూడాలు ఆందోళన బాటలో పడ్డారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితుడుని కూడా అరెస్టు చేసేంతవరకు తాము విధులకు హాజరుకామంటూ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

జూడా నిరసనలతో అత్యవసర వైద్య సేవలు కూడా నిలిచిపోయాయి. వైద్యులు సరిగా లేకపోవడంతోనే తెనాలికి చెందిన ఒక మహిళ మృతిచెందినట్లు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జూడాలు విధులు బహిష్కరించడంతో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆపరేషన్లు కూడా రెండ్రోజులు వాయిదా వేస్తున్నట్లు అధికారులు వార్డుల్లో సమాచారం ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.