యాప్నగరం

గుంటూరు: అమ్మాయి అని చెప్పి పెళ్లి, మోసపోయాను.. పోలీసులకు యువకుడి ఫిర్యాదు

Guntur Wedding With Transgender ఘటన కలకలంరేపింది. తనకు థర్డ్ జెండర్‌ను ఇచ్చి పెళ్లి చేసి మోసం చేశారని బాధిత యువకుడు ఆరోపిస్తున్నారు. విడాకులు ఇవ్వమని అడుగుతుంటే.. తనపైనే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించి గర్భ సంచి లేకపోవడంతో పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారని అంటున్నారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. మోసం చేసిన అత్త, మామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 27 Sep 2022, 9:58 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Guntur Wedding With Transgender
అమ్మాయి అని చెప్పి వివాహం చేశారని.. తీరా చూస్తే థర్డ్ జండర్ అని తేలిందంటూ ఓ యువకుడు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. బాధిత యువకుడు చెబుతున్న వివరాల ప్రకారం.. పాత గుంటూరుకు చెందిన యువకుడు కంప్యూటర్‌ డిజైనింగ్‌ చేశారు. 2019లో ఓ యువతితో పెద్దలు వివాహం చేశారు. ఆ అమ్మాయి అందంగా ఉందని.. అలాగే ఆమె పేరుతో రూ. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని నమ్మించారు. ఆ ఆస్తులన్నీ ఆమెకు వస్తాయని నమ్మించి కట్నకానుకలు ఇవ్వకుండా పెళ్లి చేశారు. వివాహమై రెండేళ్లవుతున్నా పిల్లలు కలగకపోవడంతో అతడికి అనుమానం వచ్చింది.
ఆ యువకుడు ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు చేసిన వైద్యులు ఆమె థర్డ్‌ జండర్‌ అని చెప్పారట. ఆ తర్వాత ఆరా తీస్తే.. ఆమెకు 12 ఏళ్ల వయసులో మగవాడి అవయవాలను తొలగించి సర్జరీ చేసినట్లు తనకు తెలిసింది అన్నారు. తన భార్య చూడడానికి అమ్మాయిలా కనిపిస్తున్నా పూర్తిగా మగలక్షణాలు ఉన్నట్లు అతడు చెబుతున్నారు. గర్బసంచి లేకపోవడంతో పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు తనకు చెప్పారంటున్నారు. ఆ విషయం దాచిపెట్టి తనతో పెళ్లి చేసి మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయాలన్నీ దాచిపెట్టి తన అత్తమామలు తనను మోసం చేసి పెళ్లి చేశారని లబోదిబోమంటున్నారు. దాదాపు ఆరునెలలనుంచి ఈ వ్యవహారంపై రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తుంది అంటున్నారు. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని.. విడాకులు ఇవ్వమంటే తనపైనే తప్పుడు కేసులు పెట్టి రూ.15 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయంచేయాలని బాధితుడు కోరుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు.

అంతేకాదు తాడికొండ పోలీస్ స్టేషన్‌లో తనపై కేసు పెట్టారని బాధితుడు చెబుతున్నారు. పిల్లల పేరుతో వేధిస్తున్నారంటూ ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. తనను మోసం చేశారని పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లో మోసం చేశారని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చెయ్యడం కుదరదని చెప్పారంటున్నారు. తనను మోసం చేసిన భార్య, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.