యాప్నగరం

గుంటూరు: కొడుకుని ఫ్రెండ్ చెడగొడుతున్నాడని.. పెదనాన్న ఘోరం

కొడుకు వరసయ్యే బాలుడిని అతని ఫ్రెండ్ చెడగొడుతున్నాడని కోపం పెంచుకున్నాడు. అతని స్నేహితుడు కనిపించడంతో ఒక్కసారిగా కత్తితో పొడిచి చంపేశాడు. 15 ఏళ్ల బాలుడిని చంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Samayam Telugu 22 Jul 2021, 10:23 pm
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన తమ్ముడి కొడుకుని చెడగొడుతున్నాడంటూ అతని స్నేహితుడిని పెదనాన్న పొడిచి చంపేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్లకి చెందిన షేక్ సుభానీ(12), పఠాన్ అఫ్రిద్ ఖాన్(15) స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకుంటున్నారు. సుభానీ ఏదో తరగతి కాగా అఫ్రిద్ పదో తరగతి చదువుతున్నారు. సుభానీని అఫ్రిద్ చెడగొడుతున్నాడంటూ అతని పెదనాన్న బాజీ కోపం పెంచుకున్నాడు. ఈరోజు హోటల్ వద్ద అఫ్రిద్ కనిపించడంతో బాజి ఆవేశంగా కత్తితో పొడిచేశాడు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో అఫ్రిద్ కుప్పకూలిపోయాడు. బాధితుడిని వెంటనే నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే అఫ్రిద్ ప్రాణాలు విడిచాడు. అయితే పదో తరగతి విద్యార్థిని చంపడం వెనక బలమైన కారణమే ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాజీకి వివాదాస్పదుడిగా పేరున్నట్లు తెలుస్తోంది. తరచూ గొడవలు పడుతుంటాడని.. రోడ్లపై బూతులు తిడుతూ వీరంగం వేస్తుంటాడని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
attack


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.