గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత చంద్రగిరి ఏసురత్నం (Chandragiri Yesuratnam)కు సైబర్ కేటుగాళ్లు టోకరా ఇవ్వబోయారు. ఆయనకు ఫోన్ చేసిన ఓ కిలేడీ రూ.10 లక్షల ముద్ర లోన్ మంజూరైందని చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. అది ఫేక్ కాల్ అని భావించిన ఏసురత్నం.. అసలు తాను ముద్ర లోన్కి అప్లై చేయలేదని.. అలాంటిది తనకు ఎలా మంజూరు అవుతుందని ప్రశ్నించారు. ఆమె ఇంకేదో చెప్పబోగా ముద్ర లోన్ తనకు అవసరం లేదని.. అవసరమైన పేద వ్యాపారులకు ఇవ్వాలని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఇప్పుడీ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది చంద్రగిరి ఏసురత్నం 2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా.. ఆయనపై టీడీపీ తరఫున మద్దాలి గిరి గెలిచారు. అయితే ఆ తర్వాత మారిన పరిణామాలతో మద్దాలి గిరి వైఎస్సార్సీపీకి జైకొట్టారు. దీంతో ఏసురత్నంకు గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవి దక్కింది. అలాగే ఎమ్మెల్యే మద్దాలి గిరి గౌరవ చైర్మన్గా నియమితులయ్యారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News