రైళ్లలో చోరీలు, విమానాల్లో జల్సాలు.. వినడానికి విచిత్రంగా ఉంది కదూ. అవును ఈ ఇద్దరు స్నేహితులు చదివింది ఐదో తరగతి.. కానీ దొంగతనాలు చేయడంలో మంచి ఎక్స్పర్ట్స్. రైళ్లలో ఏసీ బోగీలను టార్గెట్ చేసి.. ప్రయాణికుల దగ్గర చోరీలు చేస్తారు. ఆ డబ్బులతో విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తుంటారు. ఇద్దరు కథ అడ్డం తిరిగి పోలీసులకు దొరికిపోయారు. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన హర్షవర్థన్రెడ్డి, ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన హరికృష్ణలు మంచి స్నేహితులు. ఇద్దరు జల్సాలకు అలవాటుపడి చోరీలు మొదలు పెట్టారు. చక్కగా ఇన్షర్టు, కాస్ట్లీ డ్రెస్లు, చెప్పులు, షూ వేసుకుని రైళ్లల్లో ప్రయాణికుల్లా బిల్డప్ ఇస్తారు. రిజర్వేషన్ చేసుకున్న రైళ్లు ఎక్కుతారు. వ్యాపారులు, ధనవంతులు ఏసీ బోగీల్లో ఉంటారని భావించి.. వీరిద్దరు కూడా ఏసీ టిక్కెట్లు కొనుగోలు చేసి ఆ రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. తోటి ప్రయాణికుల్లో ఆ బోగీలో అటు, ఇటు తిరుగుతూ రెక్కీ చేస్తారు.
ముందుగా బంగారం ధరించినవాళ్లు, విలువైన వస్తువులు ఉన్నవాళ్లను టార్గెట్ చేస్తారు. ప్రయాణికులు ఆదమరచిన సమయంలో, నిద్రపోయినప్పుడు బంగారం, విలువైన వస్తువులు దొంగతనం చేస్తారు.. వెంటనే రైలు దిగి మాయమైపోతారు. ఆ డబ్బులతో విమానంలో గోవాతో పాటూ మరికొనన్ని ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేస్తుంటారు. గుంటూరు మీదగా వెళ్లిన మూడు రైళ్లల్లో చోరీలు జరిగాయి. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
పోలీసులు టీమ్లుగా విడిపోయి నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. బుధవారం గుంటూరు రైల్వేస్టేషన్లో ఇద్దరు యువకులు అనుమానంగా కనిపించారు. ఆ సమాచారంతో పోలీసులు స్టేషన్ చుట్టూ నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేశారు. ఈ ఇద్దరి దగ్గర తనిఖీ చేస్తే ప్యాంటు జేబులో ఓ ప్యాకెట్ ఉంది. బయటకు తీసి చూడగా.. అందులో రూ.2.50 లక్షల విలువ చేసే 78 గ్రాముల బంగారపు వస్తువులు ఉన్నాయి.. పోలీసులు వాటిని సీజ్ చేశారు.
ముందుగా బంగారం ధరించినవాళ్లు, విలువైన వస్తువులు ఉన్నవాళ్లను టార్గెట్ చేస్తారు. ప్రయాణికులు ఆదమరచిన సమయంలో, నిద్రపోయినప్పుడు బంగారం, విలువైన వస్తువులు దొంగతనం చేస్తారు.. వెంటనే రైలు దిగి మాయమైపోతారు. ఆ డబ్బులతో విమానంలో గోవాతో పాటూ మరికొనన్ని ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేస్తుంటారు. గుంటూరు మీదగా వెళ్లిన మూడు రైళ్లల్లో చోరీలు జరిగాయి. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
పోలీసులు టీమ్లుగా విడిపోయి నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. బుధవారం గుంటూరు రైల్వేస్టేషన్లో ఇద్దరు యువకులు అనుమానంగా కనిపించారు. ఆ సమాచారంతో పోలీసులు స్టేషన్ చుట్టూ నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేశారు. ఈ ఇద్దరి దగ్గర తనిఖీ చేస్తే ప్యాంటు జేబులో ఓ ప్యాకెట్ ఉంది. బయటకు తీసి చూడగా.. అందులో రూ.2.50 లక్షల విలువ చేసే 78 గ్రాముల బంగారపు వస్తువులు ఉన్నాయి.. పోలీసులు వాటిని సీజ్ చేశారు.