యాప్నగరం

MLC Elections: ఓటుకు నోటు.. మరో బాంబ్ పేల్చిన మద్దాలి గిరి

MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కొనుగోలు బేరంపై సంచలన విషయాలు వెల్లడించగా.. తాజాగా.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే మద్దాలి గిరి తెరపైకి వచ్చారు. క్రాస్ ఓటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు తనను కూడా సంప్రదించారని.. ఓటు కోసం ఫోన్ చేశారని కీలక విషయాలు వెల్లడించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 27 Mar 2023, 6:29 pm

ప్రధానాంశాలు:

  • టీడీపీ రెబల్ ఎమ్మెల్యే మద్దాలి గిరి కీలక వ్యాఖ్యలు
  • క్రాస్ ఓటింగ్‌పై మద్దాలి గిరి సంచలన ఆరోపణలు
  • టీడీపీ నేతలు తననూ సంప్రదించారని స్పష్టం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Maddali Giri
మద్దాలి గిరి
MLC Elections: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు తీవ్ర రచ్చకు కారణమవుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రూ. 10 కోట్ల బేరం గురించి చెప్పగా.. తాజాగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి బాంబ్ పేల్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల‌‌ కోసం వారం రోజుల‌పాటు టీడీపీ నాయకులు తనను సంప్రదించారని Maddali Giri వెల్లడించారు. చివరి రోజు వరకు టీడీపీ నాయకులు ಓటు కోసం ప్రయత్నించారని స్పష్టం చేశారు. తన కాల్ డేటాను చూస్తే ఏ నాయకుడు ఫోన్ చేశారో తెలుస్తుందని.. ఆధారాలు చూపించారు.
అక్కడితో ఆగకుండా.. మద్దాలి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'సీఎంను నమ్మించి పక్కదారి చూసుకోవడం కొందరికే తెలుస్తుంది. కుట్రలు, కుతంత్రాల‌, వెన్నుపోటు రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు. కనీసం పార్టీలో గౌరవం ఇవ్వకపోవడంతోనే.. టీడీపీని వీడాం. గతంలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. కానీ.. జగన్‌పై ఉన్న అభిమానంతో మేము వైసీపీలో చేరాం. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మాపై నిందలు వేస్తున్నారు. ఎన్నికల ముందు ఈ మాటలు ఎందుకు మాట్లాడలేదు. ఇది ఎంత వరకు సమంజసం' అని మద్దాలి గిరి ప్రశ్నించారు.

'టీడీపీ పతనం అవ్వడానికి లోకేష్ కారణం. అవగాహన లేని లోకేష్ కోసం పార్టీని నాశనం చేశారు. జగన్ మమ్మల్ని సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. నేను.. నావాళ్లు మాత్రమే ఆనే నైజం చంద్రబాబుది. ప్రజా సమస్యలపై సరిగా వ్యవహరించడం లేదని కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనన్నారు. నిజాయితీగా ఉండే వ్యక్తి జగన్. నమ్మించి మోసం చేసే నైజం చంద్రబాబుది. ముక్కుసూటి‌ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్. శ్రీదేవి ఆమరావతి ఉద్యమం కోసం పోరాడాతా అని అనడం హాస్యాస్పదం. పూటకొక మాట మారిస్తే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారు' అని గిరి వ్యాఖ్యానించారు.

టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన మద్దాలి గిరి.. 2019 డిసెంబర్ 30న సీఎం జగన్‌ను కలిశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌‌తో కలిసి సీఎం క్యాంపు ఆఫీస్‌కు వెళ్లి.. జగన్‌కు మద్దతు ప్రకటించారు. కానీ.. వైసీపీలో మాత్రం చేరలేదు. టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే.. జగన్ వేవ్‌లో కూడా గెలిచిన మద్దాలి గిరి.. టీడీపీకి దూరంగా జరగడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. మద్దాలి గిరి జగన్‌కు మద్దతు ప్రకటించినా.. ఎప్పుడూ టీడీపీపై విమర్శలు చేయలేదు. కానీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనపై ఆరోపణలు రావడంతో.. ఆయన తాజాగా ఘాటుగా స్పందించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.